News April 15, 2024
గెలిస్తేనే.. నిలుస్తారు

IPL పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉన్న RCB ఇవాళ్టి మ్యాచ్లో తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. హైదరాబాద్తో మ్యాచ్లో కూడా ఓడిపోతే ప్లే ఆఫ్స్ అవకాశాలు మరింత సంక్లిష్టం అవుతాయి. ఈ సీజన్లో 6 మ్యాచ్లు ఆడిన ఆర్సీబీ కేవలం ఒక విజయాన్ని మాత్రమే నమోదు చేసింది. మిగిలిన 8 మ్యాచుల్లో కచ్చితంగా 7 గెలవాలి. అప్పుడు 16 పాయింట్లతో ఆర్సీబీ ప్లే ఆఫ్స్కు వెళ్లేందుకు మార్గం సుగమం అవుతుంది.
Similar News
News April 3, 2026
సంజూ శాంసన్ను చూసి నేర్చుకోండి: మోదీ

కేరళం అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భారత క్రికెటర్ సంజూ శాంసన్పై PM మోదీ ప్రశంసలు కురిపించారు. ‘WC నాకౌట్లో సంజూ చెలరేగి ఆడారు. అతడి ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం మరింత బలపడ్డాయి. ఇవి నిజమైన క్రీడాకారుడి లక్షణాలు. జట్టుకు అవసరమైనప్పుడల్లా గొప్ప ఆటగాడు రాణిస్తాడు. అలానే ఓటింగ్ రోజున BJP కార్యకర్తలు ప్రతి ఇంటినీ చేరుకోవాలి. మీ అంకితభావం అత్యంత ముఖ్యం. విజయం కోసం అదనంగా పని చేయాలి’ అని పిలుపునిచ్చారు.
News April 3, 2026
నిగనిగలాడే మామిడి పండ్లు కొంటున్నారా?

సమ్మర్ వచ్చేసింది.. రోడ్ల పక్కన నిగనిగలాడే మామిడి పండ్లు నోరూరిస్తున్నాయా? వాటిని తింటే మీరు అనారోగ్యం బారినపడే ప్రమాదం ఉంది. కొందరు కాల్షియం కార్బైడ్, ఇతర రసాయనాలు కలిపి మగ్గబెడుతున్నారు. వీటి పట్ల అప్రమత్తంగా ఉండాలని HYD CP సజ్జనార్ హెచ్చరించారు. సహజంగా పండిన పండు అంతా ఒకే రంగులో ఉండదని చెబుతున్నారు. కల్తీ మామిడి పండ్ల సమాచారం తెలిస్తే 100కు లేదా 8712661212 నంబర్కు సమాచారం ఇవ్వాలని సూచించారు.
News April 3, 2026
రష్యా నుంచి 90% పెరిగిన ఆయిల్ దిగుమతులు

హార్ముజ్ సంక్షోభం నేపథ్యంలో రష్యా నుంచి ఇండియా ఆయిల్ దిగుమతులు భారీగా పెరిగాయి. ఫిబ్రవరితో పోలిస్తే మార్చిలో 90% అధికంగా చమురు వచ్చింది. అయినప్పటికీ దేశంలో మొత్తం ఇంపోర్ట్స్లో 15% తగ్గుదల నమోదైంది. గత నెలలో LPG దిగుమతులు 40% పడిపోగా, LNG రవాణా తగ్గిపోయింది. దీంతో ప్రత్యామ్నాయ వనరులపై భారత్ దృష్టిపెట్టింది. రష్యాతోపాటు అంగోలా, గాబన్, ఘనా, కాంగో తదితర దేశాల నుంచి క్రూడ్ను కొనుగోలు చేస్తోంది.


