News May 14, 2024
2012లో ఒక్కరే.. ఇప్పుడు ఐదుగురు

ఒలింపిక్స్లో పాల్గొనే భారత మహిళా రెజ్లర్ల సంఖ్య పెరుగుతోంది. 2012లో ఒక్కరు మాత్రమే ఒలింపిక్స్లో పోటీపడగా, ఆ తర్వాత 2016లో ముగ్గురు, 2020లో నలుగురు క్వాలిఫై అయ్యారు. ఈసారి పారిస్ ఒలింపిక్స్కు ఐదుగురు ఎంపికయ్యారు. దీంతో దేశంలో మహిళల రెజ్లింగ్ పురోగతి సాధిస్తోందని క్రీడా నిపుణులు అంటున్నారు. ఇప్పటివరకు ఒక్క మెడల్(2016-బ్రాంజ్) మాత్రమే గెలిచిన మహిళా రెజ్లర్లు ఈసారి ఎన్ని మెడల్స్ గెలుస్తారో చూడాలి.
Similar News
News March 14, 2026
BREAKING: కమర్షియల్ సిలిండర్ల డెలివరీ ప్రారంభం

దేశంలోని పలు రాష్ట్రాల్లో కమర్షియల్ సిలిండర్ల డెలివరీ పునరుద్ధరించినట్లు కేంద్రం ప్రకటించింది. గ్యాస్ సంక్షోభం నేపథ్యంలో ఇటీవల కమర్షియల్ సిలిండర్ల సరఫరా నిలిపివేసిన విషయం తెలిసిందే. అయితే LPG ఉత్పత్తిని పెంచామని, నేటి నుంచి కమర్షియల్ సిలిండర్ల డిస్ట్రిబ్యూషన్ కొనసాగుతుందని కేంద్ర పెట్రోలియం, గ్యాస్ మినిస్ట్రీ జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ తెలిపారు. కాగా ఏయే రాష్ట్రాల్లో పంపిణీ ఉంటుందో వెల్లడించలేదు.
News March 14, 2026
1.71 కోట్ల ORS ప్యాకెట్లు సిద్ధం: సత్యకుమార్

AP: సమ్మర్ యాక్షన్ ప్లాన్ను సిద్ధం చేసినట్లు మంత్రి సత్యకుమార్ వెల్లడించారు. ‘అవేర్ ప్లాట్ఫాం ద్వారా 4-5 రోజుల ముందుగానే ఉష్ణోగ్రతల అప్డేట్ ఇస్తాం. వడదెబ్బకు గురైతే తీసుకోవాల్సిన చర్యలు, సీజనల్ వ్యాధులపై మెడికల్ సిబ్బందికి శిక్షణ ఇచ్చాం. 1.71Cr ORS ప్యాకెట్లను ఆస్పత్రులకు పంపాం. గర్భిణులు, వృద్ధులు, శిశువులు, కూలీలు, ట్రాఫిక్ పోలీసులకు వేసవి జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తాం’ అని పేర్కొన్నారు.
News March 14, 2026
సూర్య కొత్త సినిమాపై అప్డేట్

సూర్య-వెంకీ అట్లూరి కాంబోలో తెరకెక్కుతున్న ‘విశ్వనాథ్ & సన్స్’ మూవీ టీజర్ను ఈ నెల 16న సా.4.06 గంటలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రం జులైలో ప్రేక్షకుల ముందుకు రానుంది. సూర్యకు జోడీగా మమిత బైజు నటిస్తుండగా రాధిక, రవీనా టాండన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. GV ప్రకాశ్ మ్యూజిక్ అందిస్తున్నారు.


