News August 20, 2024
బియ్యమే.. కందిపప్పు, చక్కెర లేదు!

AP: రేషన్ సరకుల్లో బియ్యంతో పాటు కందిపప్పు, పంచదార ఇస్తామని ప్రభుత్వం 2 నెలలుగా చెబుతున్నా అమలు జరగడం లేదు. వచ్చే నెలలోనూ బియ్యం మాత్రమే సరఫరా అవుతుందని సమాచారం. KG కందిపప్పు ₹67, పంచదార ₹17కే అందుతుందని ఆశలు పెట్టుకున్న పేదలకు నిరాశే ఎదురవనుంది. జులైలో కందిపప్పు సేకరణకు టెండర్లు పిలవగా, జుడీషియల్ ప్రివ్యూలో న్యాయమూర్తి వివరణ కోరారు. సమాధానం పంపడంలో అధికారులు అలసత్వం వహించినట్లు తెలుస్తోంది.
Similar News
News October 13, 2025
ఉద్యోగులకు EPFO గుడ్న్యూస్

EPFO సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్(CBT) సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మెంబర్లు తమ అకౌంట్ నుంచి 100% డబ్బు డ్రా చేసుకొనే సదుపాయానికి ఆమోద ముద్ర వేశారు. ఎంప్లాయీతో పాటు ఎంప్లాయర్ షేర్ నుంచి 100% విత్డ్రా చేసుకోవచ్చు. దీని వల్ల 7 కోట్ల మందికి పైగా ఉన్న ఉద్యోగులకు ప్రయోజనం కలగనుంది. అటు 13 క్లాజులను 3 విభాగాలుగా విభజించారు. విద్య, ఇల్నెస్, వివాహాన్ని ‘అవసరాలు’ కేటగిరీలోకి తీసుకొచ్చారు.
News October 13, 2025
మోదీని కలవడం గర్వంగా ఉంది: CM చంద్రబాబు

AP: ఢిల్లీలో PM మోదీతో CM చంద్రబాబు భేటీ ముగిసింది. ఆయన్ను కలవడం గౌరవంగా ఉందని CM ట్వీట్ చేశారు. ‘ప్రజా సేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న ప్రధానికి రాష్ట్ర ప్రజల తరఫున శుభాకాంక్షలు చెప్పా. GST సంస్కరణల విషయంలో ఆయన నాయకత్వాన్ని ప్రశంసించా. కర్నూలులో జరిగే ‘సూపర్ GST-సూపర్ సేవింగ్స్’ కార్యక్రమానికి ఆహ్వానించా. NOV 14, 15 తేదీల్లో విశాఖలో జరిగే CII భాగస్వామ్య సదస్సుకి ఇన్వైట్ చేశా’ అని వెల్లడించారు.
News October 13, 2025
బందీల విడుదల.. మహిళలు ఏమయ్యారు?

గాజా పీస్ ప్లాన్లో భాగంగా హమాస్ మిగతా 20 మంది ఇజ్రాయెల్ బందీలను విడుదల చేసింది. రెండేళ్ల తర్వాత వారు కుటుంబాలను కలుసుకుని భావోద్వేగానికి లోనయ్యారు. బతికున్న వారందరినీ రిలీజ్ చేసినట్లు హమాస్ ప్రకటించింది. అయితే వారిలో ఒక్క మహిళ కూడా లేదు. ఇజ్రాయెల్పై దాడికి దిగిన సమయంలో మహిళలను అపహరించి హమాస్ అకృత్యాలకు పాల్పడింది. వారిని చంపేసిందా? లేదా తమ అధీనంలోనే పెట్టుకుందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.