News March 30, 2025
అప్పుడే నా జన్మ సార్థకం అవుతుంది: సీఎం చంద్రబాబు

AP: జీరో పావర్టీ సాధించగలిగితే తన జన్మ సార్థకం అవుతుందని CM చంద్రబాబు అన్నారు. ఆర్థిక అసమానతలు రూపుమాపేందుకు P4 విధానం తీసుకొస్తున్నట్లు చెప్పారు. సమాజం వల్ల కొందరు ఉన్నతంగా ఎదిగారని, వారు తిరిగి సమాజానికి ఇవ్వాలని కోరారు. 20 ఏళ్ల క్రితమే IT ప్రాముఖ్యత చెప్పానని, తన మాట విని IT వైపు వెళ్లిన వారు మంచి స్థితిలో ఉన్నారన్నారు. అధికంగా డబ్బులు సంపాదించే తెలివి ఉన్నవాళ్లు భారతీయులని CM వివరించారు.
Similar News
News September 11, 2025
OTT డీల్స్తో బడ్జెట్ రికవరీ!

రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కాంతార చాప్టర్ 1’ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఈక్రమంలో ఓటీటీ రైట్స్ను భారీ మొత్తానికి ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’ దక్కించుకుంది. ఏకంగా రూ.125కోట్లకు అన్ని భాషల స్ట్రీమింగ్ హక్కులు పొందినట్లు టాక్. అలాగే నందమూరి బాలకృష్ణ ‘అఖండ-2’ క్రేజ్ను వాడుకునేందుకు నెట్ఫ్లిక్స్ ₹80కోట్లకు స్ట్రీమింగ్ హక్కులు కొన్నట్లు తెలుస్తోంది. ఈ డీల్తో బడ్జెట్లో 80% వచ్చేసిందట.
News September 11, 2025
పవన్ బాపట్ల పర్యటన రద్దు

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బాపట్ల జిల్లా పర్యటన రద్దయింది. జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించింది. వాతావరణం అనుకూలించకపోవడంతో పవన్ ప్రయాణించాల్సిన హెలికాప్టర్కు అధికారులు అనుమతి నిరాకరించారు. దీంతో చివరి నిమిషంలో ఆయన తన పర్యటనను రద్దు చేసుకున్నారు.
News September 11, 2025
నిజమైన ‘శ్రీమంతుడు’!

మల్టీ మిలియనీర్ అనంత్ అంబానీ మంచి మనసు చాటుకున్నారు. పంజాబ్ వరదల్లో సర్వం కోల్పోయిన ప్రజలకు సాయం చేసేందుకు ముందుకొచ్చారు. రిలయన్స్ ఫౌండేషన్, వనతారా ఫౌండేషన్ ద్వారా 10వేల కుటుంబాలకు పోషకాహారంతో కూడిన రేషన్ కిట్లు అందించారు. ఒంటరి మహిళలు & వృద్ధులు ఉంటే రూ.5వేలు పంపిణీ చేశారు. అలాగే పశువులకు వైద్యం అందించి మెడిసిన్స్, ఫుడ్స్ ఇస్తున్న అనంత్ నిజమైన శ్రీమంతుడు అని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.