News October 7, 2025
అలా చేస్తేనే రోహిత్, కోహ్లీ టీమ్లో ఉంటారు: ABD

2027 ODI WC టీమ్లో చోటు దక్కాలంటే రోహిత్, కోహ్లీ పరుగులు చేయాల్సిందేనని SA మాజీ క్రికెటర్ డివిలియర్స్ అన్నారు. ‘WC వరకు రోహిత్, కోహ్లీ జట్టులో ఉంటారన్న గ్యారంటీ లేదు. అందుకే గిల్ను కెప్టెన్ చేశారు. ఇది సరైన నిర్ణయమే. వారిద్దరి నుంచి అతడు నేర్చుకునే అవకాశం ఉంటుంది. టీమ్ ఇండియాలో కాంపిటిషన్ ఎక్కువ కాబట్టి రోహిత్, కోహ్లీ రన్స్ చేయక తప్పదు. వారు రాణిస్తారనే నమ్మకం ఉంది’ అని పేర్కొన్నారు.
Similar News
News October 7, 2025
CJIపై దాడి.. పశ్చాత్తాపం లేదన్న లాయర్

CJI గవాయ్పై దాడి పట్ల తనకు పశ్చాత్తాపం లేదని న్యాయవాది రాకేశ్ తెలిపారు. ఖజురహోలోని విష్ణువు విగ్రహ పునరుద్ధరణపై ఆయన వ్యాఖ్యలు అవమానకరంగా అనిపించాయని, తనతో దైవమే ఇలా దాడి చేయించిందన్నారు. తాను జైలుకెళ్లేందుకూ సిద్ధమని మీడియాతో చెప్పారు. ఈ పని పట్ల తన కుటుంబం అసంతృప్తితో ఉందని, తనను అర్థం చేసుకోవడం లేదన్నారు. తన మానసిక స్థితి బాగానే ఉందని చెప్పారు. అరెస్టైన కొన్ని గంటల్లోనే ఆయన విడుదలయ్యారు.
News October 7, 2025
మోనో క్రోమ్ మేకప్ గురించి తెలుసా?

కొట్టొచ్చినట్లు కనిపించే మేకప్ చాలామందికి నచ్చదు. అలాంటి వారికోసమే వచ్చింది మోనోక్రోమ్ మేకప్. దీంట్లో ముఖం, కళ్లు, పెదాలకు ఒకే రంగును ఉపయోగిస్తారు. దీనివల్ల నేచురల్ లుక్ వస్తుంది. ఫౌండేషన్, కన్సీలర్ అప్లై చేసిన తర్వాత లేత గులాబీరంగు లిప్స్టిక్, అలాగే లేత గులాబీ బ్లష్, ఐ మేకప్ వేస్తే చాలు. ఇదే కాకుండా సీజన్తో సంబంధం లేకుండా అన్నివేడుకలకూ సరిపడే మరో రకం న్యూడ్ మేకప్.
News October 7, 2025
‘స్థానిక’ ఎన్నికలు.. ఈ వేళ్లకు ‘సిరా’

TG: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటర్లకు గందరగోళం లేకుండా ఏ వేలికి సిరా వేయాలో ఎస్ఈసీ నిర్ణయం తీసుకుంది. ఎంపీటీసీ, ZPTC ఎన్నికల్లో ఎడమచేతి చూపుడు వేలుపై, పంచాయతీ ఎన్నికల్లో మధ్య వేలుపై సిరాచుక్క వేయాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నెలలో రెండు దశల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఈ నెల 31 నుంచి మూడు దశల్లో GP ఎన్నికలు జరుగుతాయని ఈసీ <<17863370>>షెడ్యూల్<<>> జారీ చేసిన సంగతి తెలిసిందే.