News August 29, 2024
అప్పుడే సెస్ తొలగిస్తాం: అచ్చెన్నాయుడు

AP: రైతులు పండించిన పత్తి పంట మొత్తాన్ని CCI కొనుగోలు చేసేలా కేంద్రానికి లేఖ రాస్తామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ‘పత్తి మొత్తం CCI కొంటే.. స్పిన్నింగ్, జిన్నింగ్ వ్యాపారులకు మార్కెట్ సెస్ తొలగిస్తాం. దేశ వ్యాప్తంగా స్పిన్నింగ్, జిన్నింగ్లో 7% ఉన్న ఏపీలో 50% పత్తి దిగుబడి, కొనుగోళ్లు తగ్గడం ఆవేదనకు గురిచేస్తోంది. రెండింతల దిగుబడి వచ్చే రకాలను అందుబాటులో ఉంచాలి’ అని మంత్రి వెల్లడించారు.
Similar News
News December 13, 2025
వంటింటి చిట్కాలు

* బియ్యం డబ్బాలో నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఉంచితే పురుగు చేరదు.
* వండటానికి ముందు ఆకుకూరలను పంచదార నీళ్ళలో ఉంచితే కూరలు రుచిగా వుంటాయి.
* అరిసెలు వండేటప్పుడు పాకంలో బియ్యం పిండి సరిపోకపోతే తగినంత గోధుమపిండి కలపండి.
* పెండలం, కంద దుంపలు ముక్కలుగా కోసిన తరువాత కాసేపు పెరుగులో ఉంచితే జిగురు పోతుంది. కూర రుచిగా ఉంటుంది.
News December 13, 2025
అఖండ-2.. తొలిరోజు రూ.59.5 కోట్ల కలెక్షన్లు

బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన అఖండ-2 సినిమా బాక్సాఫీస్ వద్ద అదరగొట్టింది. ప్రీమియర్స్తో కలిపి తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.59.5 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించినట్లు మేకర్స్ వెల్లడించారు. బాలయ్య కెరీర్లో ఇవే బిగ్గెస్ట్ ఓపెనింగ్ కలెక్షన్లు అని తెలిపారు. నిన్న విడుదలైన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చిన విషయం తెలిసిందే. ఆది పినిశెట్టి, సంయుక్త, హర్షాలీ కీలక పాత్రలు పోషించారు.
News December 13, 2025
NIT ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాలు

<


