News November 1, 2024
IPL చరిత్రలో ఇద్దరు మాత్రమే!

IPL చరిత్రలో అత్యధికంగా సంపాదించిన ప్లేయర్ల గురించి నెట్టింట చర్చ జరుగుతోంది. ఇందులో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు మాత్రమే రూ.200+ కోట్లు సంపాదించినట్లు క్రికెట్ వర్గాలు పేర్కొన్నాయి. Mi ప్లేయర్ రోహిత్ రూ.210.9 కోట్లు, RCB ప్లేయర్ కోహ్లీ రూ.209.2 కోట్లు, CSK ప్లేయర్ MS ధోనీ రూ.192.84 కోట్లు, CSK ఆటగాడు జడేజా రూ.143.01 కోట్లు IPL ద్వారా పొందారు.
Similar News
News January 26, 2026
రంజీ ట్రోఫీ.. 568 రన్స్ తేడాతో బిహార్ ఘన విజయం

రంజీ ట్రోఫీ ప్లేట్ ఫైనల్లో మణిపుర్పై బిహార్ 568 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ సీజన్లో పరుగుల పరంగా ఇదే బిగ్గెస్ట్ విన్. బిహార్ ఆటగాళ్లు పీయూష్ సింగ్ 216*, బిపిన్ 143, సకిబుల్ గని 108 పరుగులతో చెలరేగారు. కాగా ఈ విజయంతో వచ్చే సీజన్లో ఎలైట్ గ్రూపునకు బిహార్ అర్హత సాధించింది. రంజీ ట్రోఫీలో జట్లను వాటి ప్రదర్శనల ఆధారంగా ఎలైట్(అగ్రశ్రేణి), ప్లేట్(దిగువ శ్రేణి) గ్రూపులుగా విభజిస్తారు.
News January 26, 2026
అండాశయ క్యాన్సర్కు కారణాలివే..

ఒవేరియన్ కేన్సర్కి నిర్దిష్టమైన లక్షణాలు లేకపోవడం వల్ల చివరి దశ వరకూ దీన్ని గుర్తించడం కష్టం. అందుకే దీన్ని సైలెంట్ కిల్లర్గా పరిగణిస్తారు నిపుణులు. అండం విడుదల జరిగే సంఖ్య తగ్గితే అండాశయ కేన్సర్ వచ్చే ప్రమాదం తక్కువని చెబుతున్నారు. రొమ్ము క్యాన్సర్ ఉన్నా, కుటుంబంలో ఎవరికైనా ఉన్నా ఇది వచ్చే అవకాశం ఎక్కువ. పిల్లలు లేకపోయినా, ఆలస్యంగా మెనోపాజ్ వచ్చినా దీని ప్రమాదం పెరుగుతుంది.
News January 26, 2026
అండాశయ క్యాన్సర్ లక్షణాలు

చాలామంది మహిళలు మెనోపాజ్ లక్షణాలను విస్మరిస్తుంటారు. అండాశయ క్యాన్సర్కూ కొన్నిసార్లు ఇవే లక్షణాలుంటాయంటున్నారు నిపుణులు. పొత్తికడుపు ఉబ్బరం, బరువు తగ్గడం, కటి ప్రాంతంలో అసౌకర్యం, అలసట, వెన్నునొప్పి, జీర్ణక్రియలో ఇబ్బంది, సెక్స్ సమయంలో నొప్పి వంటి లక్షణాలుంటాయి. కాబట్టి ఏవైనా అసాధారణ లక్షణాలు, మార్పులు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.


