News November 1, 2024
IPL చరిత్రలో ఇద్దరు మాత్రమే!

IPL చరిత్రలో అత్యధికంగా సంపాదించిన ప్లేయర్ల గురించి నెట్టింట చర్చ జరుగుతోంది. ఇందులో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు మాత్రమే రూ.200+ కోట్లు సంపాదించినట్లు క్రికెట్ వర్గాలు పేర్కొన్నాయి. Mi ప్లేయర్ రోహిత్ రూ.210.9 కోట్లు, RCB ప్లేయర్ కోహ్లీ రూ.209.2 కోట్లు, CSK ప్లేయర్ MS ధోనీ రూ.192.84 కోట్లు, CSK ఆటగాడు జడేజా రూ.143.01 కోట్లు IPL ద్వారా పొందారు.
Similar News
News October 26, 2025
అష్ట ధర్మములు ఏవంటే?

1. యజ్ఞాలు చేయడం, 2. వేదాలు చదవడం,
3. దానాలు చేయడం, 4. తపస్సు చేయడం,
5. సత్యాన్నే పలకడం, 6. సహనం పాటించడం,
7. కష్ట సమయాల్లో నిలకడ, ధైర్యంగా ఉండటం,
8. వివేకం, ముందుచూపుతో వ్యవహరించడం.
ఈ ఎనిమిది ధర్మాలను పాటించడం వలన మనిషి ధర్మబద్ధమైన జీవితాన్ని గడుపుతూ, ఆధ్యాత్మిక పురోగతిని సాధిస్తాడని శాస్త్రాలు చెబుతున్నాయి.
<<-se>>#Sankhya<<>>
News October 26, 2025
చనిపోయిన స్నేహితుడిపై ఎర్రిస్వామి ఫిర్యాదు

బైక్ ప్రమాదంలో చనిపోయిన శివశంకర్పై అతడి స్నేహితుడు ఎర్రిస్వామి కర్నూలు (D) ఉలిందకొండ PSలో ఫిర్యాదు చేశాడు. ‘నేను, శివశంకర్ మద్యం సేవించాం. అతడి నిర్లక్ష్యం వల్లే ఇద్దరం కిందపడిపోయాం. శివ స్పాట్లో చనిపోయాడు. డెడ్ బాడీని పక్కకు తీసేందుకు ప్రయత్నించాను. మా <<18102090>>బైకును<<>> మరో వాహనం ఢీకొట్టడంతో అది రోడ్డు మధ్యలో పడింది. దీంతో బస్సు బైకును లాక్కెళ్లింది’ అని తెలిపాడు. దీంతో శివపై పోలీసులు కేసు నమోదు చేశారు.
News October 26, 2025
వంటింటి చిట్కాలు

☛ ఇడ్లీ పిండి పులవకుండా ఉండాలంటే ఆ పిండిపై తమలపాకు ఉంచండి.
☛ క్యాబేజీ ఉడికించేటప్పుడు వచ్చే వాసన కొందరికి నచ్చదు. అప్పుడు చిన్న అల్లం ముక్క వేస్తే ఆ వాసన తగ్గుతుంది.
☛ అల్లం వెల్లుల్లి ముద్ద చేసేటప్పుడు చెంచా వంటనూనె చేర్చితే.. ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది.
☛ కొత్త బంగాళాదుంపలు ఉడికించేటప్పుడు మట్టివాసన వస్తుంటే నాలుగు పుదీనా ఆకులు వేయండి. వాసన పోయి కూరకు సువాసన వస్తుంది.


