News November 1, 2024
IPL చరిత్రలో ఇద్దరు మాత్రమే!

IPL చరిత్రలో అత్యధికంగా సంపాదించిన ప్లేయర్ల గురించి నెట్టింట చర్చ జరుగుతోంది. ఇందులో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు మాత్రమే రూ.200+ కోట్లు సంపాదించినట్లు క్రికెట్ వర్గాలు పేర్కొన్నాయి. Mi ప్లేయర్ రోహిత్ రూ.210.9 కోట్లు, RCB ప్లేయర్ కోహ్లీ రూ.209.2 కోట్లు, CSK ప్లేయర్ MS ధోనీ రూ.192.84 కోట్లు, CSK ఆటగాడు జడేజా రూ.143.01 కోట్లు IPL ద్వారా పొందారు.
Similar News
News February 3, 2026
అందుకే ట్రంప్ మొదట అనౌన్స్ చేశారు: గోయల్

ట్రేడ్ డీల్ గురించి US అధ్యక్షుడు ట్రంప్ ముందే ప్రకటించడంపై ప్రతిపక్షాలు విమర్శిస్తున్న వేళ మంత్రి గోయల్ క్లారిటీ ఇచ్చారు. టారిఫ్స్ తగ్గించినట్లు మొదట అమెరికానే ప్రకటించిందని అందుకే ట్రంప్ మాట్లాడారని వివరించారు. టారిఫ్స్ విధించినప్పుడు ప్రకటన చేసినట్టే ఇప్పుడు కూడా ట్రంప్ చెప్పారని అన్నారు. కాగా ట్రంప్ కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ఏకపక్షంగా నిర్ణయాలు ప్రకటిస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శలు చేశాయి.
News February 3, 2026
రాహుల్ దేశాన్ని తప్పుదోవపట్టిస్తున్నారు: గోయల్

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ద్వంద్వ వైఖరిని అనుసరిస్తున్నారని వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ విమర్శించారు. రాహుల్ లాంటి నెగటివ్ ఆలోచనలు కలిగిన వ్యక్తులు దేశాన్ని తప్పుదోవపట్టిస్తున్నారని మండిపడ్డారు. దేశ పురోగతి గురించి వారికి పట్టింపు లేదన్నారు. రాహుల్ సహా విపక్ష ఎంపీలు పార్లమెంటులో స్పీకర్ పట్ల అవమానకరంగా ప్రవర్తించారన్నారు. అందుకే పార్లమెంటులో మాట్లాడాల్సిన విషయం ఇక్కడ చెప్పాల్సి వచ్చిందన్నారు.
News February 3, 2026
జనసేన ఎమ్మెల్యేపై కేసు నమోదు

AP: మహిళపై <<18974672>>లైంగిక వేధింపుల ఆరోపణలు<<>> ఎదుర్కొంటున్న రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై కేసు నమోదైంది. NHRC ఆదేశాలతో ఎస్పీ పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కాగా ఈ వ్యవహారంపై ఇవాళ జనసేన త్రిసభ్య కమిటీ ఆయనను <<19038842>>విచారణ<<>> చేసిన విషయం తెలిసిందే.


