News January 3, 2025

విజయ నెయ్యి మాత్రమే వాడాలి: ప్రభుత్వం

image

తెలంగాణలోని అన్ని ఆలయాల్లో ప్రభుత్వ రంగ సంస్థ విజయ డెయిరీ నెయ్యి మాత్రమే వాడాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రైవేట్ డైయిరీతో ఒప్పందం చేసుకున్న భద్రాద్రి ఆలయ అధికారులపై చర్యలు తీసుకుంది. అన్ని ఆలయాల్లో నెయ్యి సరఫరాపై నివేదిక ఇవ్వాలని, ఇతర డెయిరీలతో ఒప్పందాలు చేసుకుని ఉంటే రద్దు చేసుకోవాలని సూచించింది. యాదాద్రిలో మాత్రం మార్చి వరకు మదర్ డెయిరీ నెయ్యి వాడేందుకు అనుమతి ఇచ్చింది.

Similar News

News December 9, 2025

MBNR: ‘నవోదయ ప్రవేశ పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలి’

image

నాగర్ కర్నూల్ జిల్లా వట్టెంలోని జవహర్ నవోదయ 6వ తరగతి ప్రవేశ పరీక్ష (డిసెంబర్ 13)ను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా విద్యాశాఖ అసిస్టెంట్ కమిషనర్ రాజశేఖర్ రావు సూచించారు. బిజినేపల్లిలో సెంటర్ సూపరింటెండెంట్లు, పరిశీలకులకు శిక్షణ ఇచ్చారు. 29 కేంద్రాల్లో పరీక్ష ఏర్పాట్లు పూర్తయ్యాయని ప్రిన్సిపాల్ భాస్కర్ కుమార్ తెలిపారు.

News December 9, 2025

గజగజ.. రేపు కూడా చలి తీవ్రత

image

తెలంగాణలో చలి వణికిస్తోంది. హైదరాబాద్‌ సహా జిల్లాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రేపు కూడా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, హైదరాబాద్‌లో టెంపరేచర్ 6-8 డిగ్రీలకు పడిపోనున్నట్లు వాతావరణ నిపుణులు తెలిపారు. ఉదయం, రాత్రి వేళల్లో ప్రయాణాలు మానుకోవాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులను బయటికి తీసుకెళ్లవద్దని సూచిస్తున్నారు.

News December 9, 2025

‘తెలంగాణ విజన్ -2047’ డాక్యుమెంట్.. కీలక అంశాలు

image

⋆ 2047 నాటికి $3T ఆర్థిక వ్యవస్థే ప్రధాన లక్ష్యం
⋆ 10 కీలక వ్యూహాలతో డాక్యుమెంట్, సమతుల్య అభివృద్ధి కోసం రాష్ట్రాన్ని 3 జోన్లుగా విభజన (CURE, PURE, RARE)
⋆ పెట్టుబడుల ఆకర్షణ, పాలనలో పారదర్శకత, ఫ్యూచర్ సిటీ, మూసీ పునరుజ్జీవనం వంటి ప్రాజెక్టులు. కళలు, పర్యాటకాన్ని పరిరక్షించడం, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా విధానాల రూపకల్పన వంటివి ఇందులో ఉన్నాయి. పూర్తి డాక్యుమెంట్ కోసం ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.