News July 1, 2024

ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ ఫలితాలు విడుదల

image

ఏపీలో ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ ఫలితాలను మంత్రి నారా లోకేశ్ విడుదల చేశారు. పదో తరగతి పరీక్షలను 15,058 మంది రాయగా, 9,531 మంది పాసైనట్లు తెలిపారు. ఇంటర్ పరీక్షలకు 27,279 మంది హాజరుకాగా, 18,842 మంది ఉత్తీర్ణత సాధించినట్లు వెల్లడించారు. ఫలితాల కోసం ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.

Similar News

News December 14, 2025

సౌతాఫ్రికా ఆలౌట్.. భారత్ టార్గెట్ ఎంతంటే..?

image

భారత బౌలర్ల విజృంభణతో సౌతాఫ్రికా తక్కువ స్కోరుకే పరిమితమైంది. 117 పరుగులకే ఆలౌట్ అయింది. జట్టులో మార్క్రమ్ (61) మినహా ఇంకెవరూ ప్రభావం చూపలేదు. ఫెరీరా 20, ఆన్రిచ్ నోర్జే 12 పరుగులు చేశారు. భారత బౌలర్లలో హర్షిత్ రాణా, వరుణ్, అర్ష్‌దీప్, కుల్దీప్ తలో 2 వికెట్లు, హార్దిక్, దూబే చెరో వికెట్ తీశారు. భారత్ టార్గెట్ 118.

News December 14, 2025

అప్పుడు తప్పు అని.. ఇప్పుడవే అప్పులా: బుగ్గన

image

AP: ఏపీబీసీఎల్ ద్వారా నాన్ కన్వర్టబుల్ బాండ్లను గతంలో విమర్శించిన CBN ఇప్పుడు వాటినే ఎలా జారీ చేస్తున్నారని YCP నేత బుగ్గన రాజేంద్రనాథ్ ప్రశ్నించారు. ‘18 నెలల్లో ₹2.66 లక్షల CR అప్పు చేశారు. ఉద్యోగులకు జీతాలూ సరిగా ఇవ్వడం లేదు. తెచ్చిన అప్పంతా ఏమౌతోంది?’ అని నిలదీశారు. లెక్కలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఎక్సైజ్ డ్యూటీ, మార్జిన్ ఆదాయాన్ని కూడా ఎస్క్రో అకౌంట్‌కు లింకు చేస్తున్నారని మండిపడ్డారు.

News December 14, 2025

ఇంటి వద్ద పారిజాత పుష్పాన్ని పెంచవచ్చా?

image

ఇంటి ఆవరణంలో పారిజాతం మొక్క పెంచడం చాలా శుభప్రదమని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. ఇది సానుకూల శక్తిని, శాంతిని ఆకర్షిస్తుందని అంటున్నారు. ‘సాక్షాత్తూ లక్ష్మీదేవి ఈ చెట్టులో నివసిస్తుందని, ఇంట్లో సిరిసంపదలకు లోటుండదని నమ్ముతారు. ఈ మొక్కను ఇంటికి ఈశాన్యంలో నాటడం శ్రేయస్కరం. ఇది దుష్ట శక్తులను తొలగించి, కుటుంబంలో ఐక్యత, ప్రేమను పెంచుతుంది. ఆరోగ్యపరంగానూ లాభాలుంటాయి’ అంటున్నారు.<<-se>>#Vasthu<<>>