News July 31, 2024

నేటి నుంచి ఓపెన్ స్కూల్ అడ్మిషన్లు ప్రారంభం

image

AP: పదో తరగతి, ఇంటర్మీడియట్ ఓపెన్ స్కూల్ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. నేటి నుంచి ఆగస్టు 27 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు డైరెక్టర్ నాగేశ్వరరావు తెలిపారు. రూ.200‌ ఫైన్‌తో ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్ 4 వరకు అప్లై చేసుకునేందుకు అవకాశం ఉందని చెప్పారు. <>ఆన్‌లైన్‌లో<<>> దరఖాస్తులు స్వీకరించనున్నారు.

Similar News

News April 10, 2026

భారీగా పెరగనున్న భూముల మార్కెట్ విలువ!

image

TG: త్వరలో భూముల మార్కెట్ విలువ భారీగా పెరగనుంది. 20% పెంచాలని రాష్ట్ర స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ తాజాగా ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. దీనిపై క్యాబినెట్‌లో చర్చించి సర్కార్ నిర్ణయం తీసుకోనుంది. ఆదాయ మార్గాలను పెంచేందుకు ఈ దిశగా అడుగులు వేయనున్నట్లు తెలుస్తోంది. ఇక HMDA ఆధ్వర్యంలో ప్రభుత్వ భూముల విక్రయానికి సంబంధించి ప్రపంచ స్థాయిలో ప్రచారం నిర్వహించాలని భావిస్తోంది.

News April 10, 2026

యూత్‌లో గుండె జబ్బులు.. భారంగా మారుతున్న ఇన్సూరెన్స్!

image

గతంలో 50 ఏళ్లు దాటాక వచ్చే హార్ట్ ప్రాబ్లమ్స్ ఇప్పుడు 20 ఏళ్లకే వస్తున్నాయి. దీంతో ఇన్సూరెన్స్ కంపెనీలు రిస్క్ ఎక్కువని భావించి ప్రీమియం ధరలను 50% వరకు పెంచే యోచనలో ఉన్నట్లు ప్లమ్ సంస్థ డేటా వెల్లడించింది. అంటే గతంలో కంటే ఇప్పుడు పాలసీ కోసం ఎక్కువ డబ్బులు కట్టాలి. అందుకే సరైన టైమ్‌లో ఇన్సూరెన్స్ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. లేదంటే ఆస్పత్రి ఖర్చులన్నీ సొంతంగా భరించాల్సి వస్తుందంటున్నారు.

News April 10, 2026

‘భోగాపురం’ ప్రారంభానికి రండి.. మోదీకి CBN ఆహ్వానం

image

AP: జులై/ఆగస్టులో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవం నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ వేడుకకు రావాలంటూ ప్రధాని మోదీని సీఎం చంద్రబాబు ఆహ్వానించారు. జులై 5 లేదా 8న, ఆగస్టు 17 లేదా 19 తేదీల్లో సమయం ఇవ్వాలని కోరారు. జూన్ 30 లోగా పనులు పూర్తి చేయాలని ఇప్పటికే కేంద్రం ఆదేశించినట్లు సమాచారం.