News March 17, 2024
ఓపెన్ స్కూల్ పరీక్షలు.. ఈనెల 23 వరకు ఛాన్స్

TG: ఓపెన్ టెన్త్, ఇంటర్ పబ్లిక్ పరీక్షలకు తత్కాల్ స్కీమ్ కింద ఫీజులు చెల్లించేందుకు అవకాశం కల్పించినట్లు అధికారులు తెలిపారు. టెన్త్ పరీక్షలకు రూ.500, ఇంటర్కు రూ.1000 చొప్పున ఆలస్య రుసుముతో ఈనెల 18 నుంచి 21 వరకు చెల్లించవచ్చని పేర్కొన్నారు. డీఈవోల వద్ద ఈనెల 22 వరకు, ప్రధాన కార్యాలయంలో ఈనెల 23 వరకు చెల్లించవచ్చని సూచించారు.
Similar News
News March 29, 2025
ఈ రాశుల వారికి రేపటి నుంచి పండగే!

చాలా మంది రాశి ఫలాలను నమ్ముతుంటారు. ఉగాది వచ్చిందంటే చాలు ఆ ఏడాది తమ రాశి ఫలం ఎలా ఉంటుందో తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతుంటారు. రేపటి నుంచి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ప్రారంభంకానుంది. దీంతో కొత్త పంచాంగం అందుబాటులోకి రానుంది. అయితే ఈ నూతన ఏడాది మిథునం, కర్కాటకం, తుల, కన్య రాశుల వారి ఫలితాలు అద్భుతంగా ఉండనున్నట్లు పురోహితులు చెబుతున్నారు. వీరికి కొత్త ఏడాది శుభ ఫలితాలే. ఇంతకీ మీది ఏ రాశి? COMMENT
News March 29, 2025
వృద్ధ దంపతుల ప్రాణాలు తీసిన సైబర్ నేరగాళ్లు

సైబర్ మోసగాళ్ల దోపిడీతో కర్ణాటకకు చెందిన వృద్ధ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. సైబర్ నేరగాళ్లు వీరికి వీడియో కాల్ చేసి తాము ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ అధికారులమని.. మీపై కేసులయ్యాయని బెదిరించారు. దీంతో భయపడిన దంపతులు తొలుత రూ.5లక్షలు చెల్లించారు. అక్కడితో ఆగకుండా తరచుగా బెదిరిస్తూ రూ.50 లక్షలు దోపిడీ చేశారు. దీంతో భార్యభర్తలు ఆత్మహత్య చేసుకున్నారు. వారి సూసైడ్ లెటర్లో ఆత్మహత్య కారణాలు రాశారు.
News March 29, 2025
రేపు ఓటీటీలోకి ఉపేంద్ర యూఐ మూవీ?

ఉపేంద్ర స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘UI’ మూవీ రేపు సా.4.30 గంటలకు జీకన్నడ ఛానల్లో ప్రసారం కానుంది. ఆ వెంటనే జీ5 OTTలో తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది. గతంలో వెంకటేశ్ ‘సంక్రాంతికి వస్తున్నాం’, కిచ్చా సుదీప్ ‘మ్యాక్స్’ చిత్రాలు కూడా టీవీల్లో ప్రసారమైన కాసేపటికే జీ5లోకి వచ్చేశాయి. ఇదే ట్రెండ్ను యూఐ సినిమాకు కూడా ఓటీటీ సంస్థ కొనసాగించనుందని సమాచారం.