News May 23, 2024

నేడు కర్నూలులో APERC కార్యాలయం ప్రారంభం

image

రాష్ట్ర విభజన నుంచి HYDలోనే కొనసాగుతున్న APERC(ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి) ప్రధాన కార్యాలయం APకి తరలిరానుంది. కర్నూలు శివారు దిన్నెదేవరపాడులో 2 ఎకరాల విస్తీర్ణంలో శాశ్వత భవనాన్ని నిర్మించారు. ఇవాళ అధికారులు ప్రారంభోత్సవం చేయనున్నారు. వారంలో కార్యకలాపాలు జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా అమరావతిలో కాకుండా కర్నూలులో ఆఫీస్ నెలకొల్పడంపై హైకోర్టులో విచారణ సాగుతోంది.

Similar News

News November 27, 2025

వేరుశనగ, మొక్కజొన్న పంటలకు పందుల నుంచి రక్షణ ఇలా..

image

వేరుశనగ, మొక్కజొన్న పంటలకు పందుల నుంచి ముప్పు ఎక్కువగా ఉంటుంది. దీనికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వేరుశనగ పొలం చుట్టూ 4 వరుసల్లో కుసుమ పంట వేస్తే ఆ మొక్క ముళ్లు పందిని గాయపర్చే అవకాశం ఉంది. కుసుమ మొక్క వాసన ఘాటుగా ఉండడం వల్ల వేరుశనగ పంట వైపు పందులు రావు. మొక్కజొన్న పంట చుట్టూ ఆముదం పంటను వేసి రక్షించుకోవచ్చు. అలాగే ముళ్లు గల ఎడారి మొక్కలు, వాక్కాయ మొక్కలను పెంచి పంటలను కాపాడుకోవచ్చు.

News November 27, 2025

RVNLలో ఉద్యోగాలు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

image

రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ (<>RVNL<<>>)లో 17 పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. డిప్లొమా, బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. సీనియర్ డిప్యూటీ జనరల్ మేనేజర్, మేనేజర్, డిప్యూటీ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు ఉన్నాయి. రాత పరీక్ష/ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://rvnl.org/

News November 27, 2025

డిసెంబర్‌లో నింగిలోకి రోబో: ఇస్రో ఛైర్మన్

image

ఏడాదికి 50 శాటిలైట్ల చొప్పున వచ్చే మూడేళ్లలో 150 శాటిలైట్లను ప్రయోగించేందుకు ప్లాన్ చేస్తున్నట్టు ఇస్రో ఛైర్మన్ నారాయణన్ తెలిపారు. విపత్తులకు సంబంధించిన కచ్చితమైన సమాచారాన్ని ప్రజలకు అందించేలా శాటిలైట్లను ప్రయోగిస్తున్నామన్నారు. 2035 నాటికి సొంత అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నామని తెలిపారు. ఈ డిసెంబర్‌లో నింగిలోకి రోబోను పంపేందుకు చర్యలు ముమ్మరంగా సాగుతున్నట్టు నారాయణన్ చెప్పారు.