News November 25, 2024
APలో తొలి కంటైనర్ ఆస్పత్రి ప్రారంభం

ఏజెన్సీల్లో డోలీ మోతలకు చెక్ పెట్టేలా AP ప్రభుత్వం రంగంలోకి దిగింది. మన్యం(D) సాలూరు(మ) కరడవలసలో తొలి కంటైనర్ ఆస్పత్రిని మంత్రి సంధ్యారాణి ప్రారంభించారు. గిరిజన, కొండ ప్రాంతాల్లోని ప్రజలకు ఆరోగ్య సేవలు అందించడమే లక్ష్యంగా దీనిని తీసుకొచ్చామన్నారు. ఆశా కార్యకర్త, బీపీ, షుగర్ సహా 105 రకాల మందులు అందుబాటులో ఉంటాయన్నారు. చిన్నారులకు టీకాలు, పలు మెడికల్ టెస్టులు చేయించుకునే సౌకర్యం ఇక్కడ ఉందన్నారు.
Similar News
News December 21, 2025
సీఎం జిల్లా నుంచే మాజీ సీఎం పోరుబాట

TG: రెండేళ్ల తర్వాత యాక్టివ్గా కనిపిస్తున్న కేసీఆర్ కృష్ణా జలాలపై సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా నుంచే పోరాటం మొదలుపెట్టనున్నట్లు ప్రకటించారు. రెండు, మూడు రోజుల్లో అక్కడి నేతలతో సమావేశమవ్వడమే కాకుండా సభ నిర్వహిస్తామని స్పష్టం చేశారు. అటు నదీజలాల విషయంలో కేంద్రంలోని బీజేపీపైనా ఫైట్ చేస్తామని ప్రకటించారు. కాంగ్రెస్ హామీలకు జనం టెంప్ట్ అయి ఓటేశారని, ఈ ప్రభుత్వం ఒక్క హామీ నెరవేర్చలేదని ఫైరయ్యారు.
News December 21, 2025
ఫ్యూచర్ సిటా? తోక సిటా?: కేసీఆర్

TG: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదించిన ఫ్యూచర్ సిటీపై కేసీఆర్ విమర్శలు గుప్పించారు. ‘మేం ఫార్మా సిటీ కోసం భూమి తీసుకున్నాం. దాన్ని ఫ్యూచర్ సిటీ అంటున్నారు. విద్యార్థులను సాకలేని మీరు ఫ్యూచర్ సిటీ కడతారా? అది ఫ్యూచర్ సిటా? తోక సిటా? వనతార అంటూ జూపార్కును అమ్మేస్తారా? ఈ ప్రభుత్వంలో దిక్కుమాలిన పాలసీలు.. రియల్ ఎస్టేట్ బ్రోకర్ దందాలే కనిపిస్తున్నాయి’ అని ఫైరయ్యారు.
News December 21, 2025
RTCలో ఉచిత ప్రయాణానికి స్పెషల్ కార్డులు: భట్టి

TG: మహాలక్ష్మి స్కీమ్తో RTC లాభాల్లోకి వచ్చిందని, ఇప్పటివరకు 255 కోట్ల ఉచిత ప్రయాణాలు జరిగినట్లు Dy.CM భట్టి విక్రమార్క తెలిపారు. మహిళల కోసం స్పెషల్ కార్డులు ఇస్తామన్నారు. నిజామాబాద్, వరంగల్కు 100 ఎలక్ట్రిక్ బస్సులు రానున్నట్లు వెల్లడించారు. స్కూల్స్ తెరిచేసరికి బుక్స్, యూనిఫామ్స్ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. నాయీబ్రాహ్మణ, రజకుల ఫ్రీ కరెంట్ బకాయిలు ఉండొద్దని సూచించారు.


