News November 25, 2024
APలో తొలి కంటైనర్ ఆస్పత్రి ప్రారంభం

ఏజెన్సీల్లో డోలీ మోతలకు చెక్ పెట్టేలా AP ప్రభుత్వం రంగంలోకి దిగింది. మన్యం(D) సాలూరు(మ) కరడవలసలో తొలి కంటైనర్ ఆస్పత్రిని మంత్రి సంధ్యారాణి ప్రారంభించారు. గిరిజన, కొండ ప్రాంతాల్లోని ప్రజలకు ఆరోగ్య సేవలు అందించడమే లక్ష్యంగా దీనిని తీసుకొచ్చామన్నారు. ఆశా కార్యకర్త, బీపీ, షుగర్ సహా 105 రకాల మందులు అందుబాటులో ఉంటాయన్నారు. చిన్నారులకు టీకాలు, పలు మెడికల్ టెస్టులు చేయించుకునే సౌకర్యం ఇక్కడ ఉందన్నారు.
Similar News
News December 4, 2025
ఏయే పూజలకు ఏ సమయం అనుకూలం?

పౌర్ణమి తిథి నేడు ఉదయం 8.37AMకి ప్రారంభమై, రేపు తెల్లవారుజామున 4.43AMకి ముగుస్తుంది. కాబట్టి పౌర్ణమి రోజు చేసే ఏ పూజలైనా, వ్రతాలైనా ఈ సమయంలో చేయడం శుభప్రదమని పండితులు చెబుతున్నారు. నేడు ఉదయం 6.59AM – 2.54PM మధ్యలో రవి యోగం ఉంటుందని, ఈ సమయంలో పవిత్ర స్నానం చేస్తే పాపాలు తొలగిపోతాయని అంటున్నారు. లక్ష్మీ, సత్యనారాయణ వ్రతాలతో పాటు శివాభిషేకం, ఇతర పూజలు ప్రదోష కాలంలో చేయాలంటున్నారు.
News December 4, 2025
14,967 ఉద్యోగాలు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

కేంద్రీయ విద్యాలయాలు, జవహర్ నవోదయాల్లో 14,967 పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ నేటితో ముగియనుంది. అర్హతగల వారు అప్లై చేసుకోవచ్చు. టైర్ 1, టైర్ 2, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ( ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్), సర్టిఫికెట్ల వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. పోస్టును బట్టి PG, డిగ్రీ, B.Ed, M.Ed, MCA, M.PEd, BCA, BE, B.Tech, CTET, B.PEd, B.LiSc, ఇంటర్, డిప్లొమా ఉత్తీర్ణులు అర్హులు.
News December 4, 2025
పంటను బట్టి యూరియా వాడితే మంచిది

మొక్కల ఎదుగుదలకు అవసరమైన నత్రజనిని అందించే యూరియాను పంటను బట్టి ఉపయోగించాలి. వరి పంటకు యూరియాను బురద పదునులో వేయాలి. పెద్ద గుళికల యూరియాను వరి పైరుకు వేస్తే నత్రజని లభ్యత ఎక్కువ రోజులు ఉంటుంది. ఆరుతడి పైర్లకు యూరియాను భూమిపైన కాకుండా మొక్కల దగ్గర గుంత తీసి అందులో వేసి మట్టితో కప్పివేయాలి. ఆరుతడి పంటలకు సన్నగుళికల యూరియా వేస్తే తేమ తక్కువగా ఉన్నా, తొందరగా కరిగి మొక్కకు అందుతుంది.


