News February 7, 2025
ఆపరేషన్ టైగర్: శిండే గూటికి ఠాక్రే ఎంపీలు!

మహారాష్ట్రలో ‘ఆపరేషన్ టైగర్’ హాట్టాపిక్గా మారింది. ఉద్ధవ్ ఠాక్రే SSUBT 9 మంది ఎంపీల్లో ఆరుగురు శిండే శివసేనలో చేరబోతున్నారని సమాచారం. ఇప్పటికే చర్చలు ముగిశాయని, వచ్చే పార్లమెంటు సెషన్లోపు వీరు చేరడం ఖాయమేనని తెలుస్తోంది. కేంద్ర, రాష్ట్రాల్లో NDA అధికారంలో ఉండటం, ఐదేళ్ల వరకు నిధులు లేకుండా మనుగడ కష్టమవ్వడమే ఇందుకు కారణాలని టాక్. 2/3 వంతు MP/MLAలు మారితే పార్టీ మార్పు నిరోధక చట్టం వర్తించదు.
Similar News
News February 1, 2026
‘కాపు నేత’పై దాడి అని వైసీపీ ట్వీట్

AP: YCP నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై TDP కార్యకర్తలు దాడి చేయడం పొలిటికల్ హీట్ పెంచుతోంది. ‘కాపు నేత’పై టీడీపీ దాడి చేసిందని వైసీపీ అఫీషియల్ X పేజీలో #TDPAntiKapu అనే హాష్ట్యాగ్తో ట్వీట్ చేసింది. ‘నాడు వంగవీటి రంగాను హత్య చేశారు. మొన్న ముద్రగడ కుటుంబంపై, నేడు అంబటిపై దాడి చేశారు. తర్వాత మాపై దాడి చేస్తారా?’ అని మాజీ మంత్రి తోట త్రిమూర్తులు మండిపడ్డారు.
News February 1, 2026
కొత్త స్కామ్: రూ.5 నోటు ఉంటే రూ.10 లక్షలు అంటూ..

సైబర్ కేటుగాళ్లు మరో కొత్త పంథాలో మోసాలకు తెగబడుతున్నారు. మీ దగ్గర రూ.5 నోటు చాలా అరుదని, ఉంటే రూ.10 లక్షలు ఇస్తామని ఫోన్ కాల్స్ చేసి నమ్మిస్తున్నారు. ప్రాసెసింగ్ కోసం ముందుగా కొంత డబ్బు పంపాలని సూచిస్తున్నారు. ఇది నమ్మి వారికి డబ్బులు వేయగానే ఫోన్ స్విచ్ఛాఫ్ చేసుకుంటున్నారు. ఇలాంటి వాటితో పాటుAPK ఫైళ్లు పంపి డౌన్లోడ్ చేసుకోవాలని మెసేజులు వస్తే అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
News February 1, 2026
323 పోస్టులు.. నేటి నుంచి దరఖాస్తుల ఆహ్వానం

స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(SAI) 323 అసిస్టెంట్ కోచ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత గలవారు నేటి నుంచి FEB 15వరకు అప్లై చేసుకోవచ్చు. డిప్లొమా, ఒలింపిక్స్/పారాలింపిక్స్/ఏషియన్ గేమ్స్/ వరల్డ్ ఛాంపియన్ షిప్లో పాల్గొనడంతోపాటు కోచింగ్ సర్టిఫికెట్ కోర్సు, ద్రోణాచార్య అవార్డు గ్రహీతలు అర్హులు. రాత పరీక్ష, CAT ద్వారా ఎంపిక చేస్తారు. *మరిన్ని ఉద్యోగాల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.


