News March 22, 2024

సైలెంట్‌గా OTTలోకి వచ్చేసిన ‘ఆపరేషన్ వాలెంటైన్’

image

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా మానుషి చిల్లర్ హీరోయిన్‌గా నటించిన భారీ యాక్షన్ డ్రామా ‘ఆపరేషన్ వాలెంటైన్’ సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. ఈనెల 29న ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందని వార్తలు రాగా.. ఈరోజు అమెజాన్ ప్రైమ్ OTT ప్లాట్‌ఫామ్‌లో ప్రత్యక్షమైంది. కొత్త దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ తెరకెక్కించిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు.

Similar News

News October 2, 2024

చెత్తలో దొరికిన పెయింటింగ్.. విలువ రూ.46 కోట్లు!

image

62 ఏళ్ల క్రితం ఇటలీలోని ఓ ఇంటిని కొన్న వ్యక్తి చెత్తను శుభ్రం చేస్తుండగా ఓ పెయింటింగ్ దొరికింది. అదేదో పిచ్చి బొమ్మ అనుకుని పక్కన పెట్టేశారు. ఇన్ని దశాబ్దాల తర్వాత ఆ యజమాని కుమార్తె దాన్ని పికాసో కళాఖండంగా గుర్తించారు. అనంతరం దాని విలువ రూ.46 కోట్లని తెలిసి షాకయ్యారు. ప్రస్తుతం దాన్ని ఓ లాకర్‌లో భద్రపరిచామని, ఏం చేయాలన్నదానిపై పికాసో ఫౌండేషన్‌తో మాట్లాడుతున్నామని వారు తెలిపారు.

News October 2, 2024

కెప్టెన్సీకి బాబర్ ఆజమ్ రాజీనామా

image

పాకిస్థాన్ క్రికెట్ టీమ్ (టీ20, ODI) కెప్టెన్సీ నుంచి బాబర్ ఆజమ్ తప్పుకున్నారు. తన బ్యాటింగ్, పర్సనల్ గ్రోత్‌పై మరింత దృష్టి పెట్టేందుకే కెప్టెన్సీకి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. కెప్టెన్సీ వల్ల వర్క్ లోడ్ పెరిగిందని పేర్కొన్నారు. 2019లో టీ20, 2020లో ODI, టెస్ట్ కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్న బాబర్ 2023 ODI WC తర్వాత కెప్టెన్సీ నుంచి తప్పుకున్నారు. మళ్లీ 2024 టీ20 WCకి ముందు కెప్టెన్ అయ్యారు.

News October 2, 2024

నితీశ్ కుమార్ ఫిట్‌గా లేరు: ప్రశాంత్ కిశోర్

image

బిహార్ సీఎం నితీశ్ శారీరకంగా, మానసికంగా ఫిట్‌గా లేరని పోల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిశోర్ వ్యాఖ్యానించారు. కేంద్రంలో BJP తన ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి నితీశ్‌కు ఆసరా ఇస్తోందని దుయ్య‌బట్టారు. ప్ర‌జా జీవితం నుంచి త‌ర‌చుగా ఆయ‌న గౌర్హాజ‌రు, భూ స‌ర్వే, వ‌ర‌ద‌లు, స్మార్ట్ మీట‌ర్ల బిగింపు వంటి కీల‌క విష‌యాల‌పై మౌనాన్ని ప్రాతిప‌దిక‌గా చేసుకొని నితీశ్ ఆరోగ్యాన్ని అంచ‌నా వేస్తున్నట్టు పేర్కొన్నారు.