News March 8, 2025
రేపు ప్రత్యర్థులు.. ఆ తర్వాత ఒకే జట్టులో!

రేపు జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో న్యూజిలాండ్తో ఇండియా తలపడనుంది. ఇప్పటికే గ్రూప్ స్టేజ్లో న్యూజిలాండ్ను చిత్తు చేసిన భారత్ ఫైనల్లోనూ అదే జోరును కొనసాగించి కప్ కొట్టాలనుకుంటోంది. ఇక విజయమెవరిదో తెలియాలంటే మరికొన్ని గంటలు వేచి ఉండాల్సిందే. అయితే, కప్ కోసం ఇరు జట్లను నడిపిస్తున్న రోహిత్, శాంట్నర్ ఈనెల 23 నుంచి ఒకే టీమ్ కోసం ఆడనున్నారు. వీరిద్దరూ ఐపీఎల్లో MI జట్టు సభ్యులు కావడం విశేషం.
Similar News
News November 3, 2025
పెట్టుబడులు రాకుండా YCP కుట్రలు: మంత్రి లోకేశ్

AP: రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా YCP కుట్రలు చేస్తోందని మంత్రి లోకేశ్ మండిపడ్డారు. అన్ని కుట్రలు ఛేదించి సరైన టైమ్లో వాస్తవాలను బయటపెడతామన్నారు. ‘అభివృద్ధి కోసం ముందుకొస్తే కలిసికట్టుగా ముందుకెళ్దాం. పెట్టుబడులకు YCP సిఫార్సులను అంగీకరిస్తాం. ఆ పార్టీ సిఫార్సు చేసిన పెట్టుబడులకు వారికే క్రెడిట్ ఇస్తాం. ఎలక్షన్స్ టైమ్లోనే రాజకీయాలు.. తర్వాత రాష్ట్రాభివృద్ధే ధ్యేయం’ అని స్పష్టం చేశారు.
News November 3, 2025
‘చక్ దే ఇండియా2’ తీయాలని డిమాండ్.. కారణమిదే

18 ఏళ్ల కిందటి ‘చక్ దే ఇండియా’ గుర్తుందా? ప్లేయర్గా గెలవని హాకీ వరల్డ్ కప్ను కోచ్గా కబీర్ ఖాన్(షారుఖ్) సాధించడమే కథ. ఈ చిత్రానికి సీక్వెల్ తీయాలని డిమాండ్లు వస్తున్నాయి. మహిళల WC సాధించడంలో కోచ్ అమోల్ మజుందార్ది కీలక పాత్ర. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 11 వేల రన్స్ చేసినా ఆయన ఇంటర్నేషనల్ డెబ్యూ చేయలేదు. కోచ్గా తన కల నెరవేర్చుకున్న అమోల్ కథతో చక్ దే2 తీయాలని నెటిజన్లు కోరుతున్నారు. మీరేమంటారు?
News November 3, 2025
CII సమ్మిట్లో రూ.2లక్షల కోట్ల విలువైన ఒప్పందాలు: మంత్రి లోకేశ్

AP: ఈ నెల 14, 15 తేదీల్లో విశాఖలో CII పార్ట్నర్షిప్ సమ్మిట్ నిర్వహిస్తున్నట్లు మంత్రి లోకేశ్ తెలిపారు. ‘సమ్మిట్కు 45 దేశాల నుంచి 300 మంది పారిశ్రామికవేత్తలు వస్తున్నారు. 410కి పైగా ఒప్పందాలు జరగనున్నాయి. వీటి విలువ రూ.2లక్షల కోట్లకు పైగా ఉంటుంది. ఈ ఒప్పందాల వల్ల 9లక్షల మందికి పైగా ఉద్యోగాలు పొందుతారు. స్వదేశీ పెట్టుబడుల సాధనలో ఏపీ ఫస్ట్ ప్లేస్లో ఉంది’ అని ప్రెస్మీట్లో వివరించారు.


