News March 8, 2025
రేపు ప్రత్యర్థులు.. ఆ తర్వాత ఒకే జట్టులో!

రేపు జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో న్యూజిలాండ్తో ఇండియా తలపడనుంది. ఇప్పటికే గ్రూప్ స్టేజ్లో న్యూజిలాండ్ను చిత్తు చేసిన భారత్ ఫైనల్లోనూ అదే జోరును కొనసాగించి కప్ కొట్టాలనుకుంటోంది. ఇక విజయమెవరిదో తెలియాలంటే మరికొన్ని గంటలు వేచి ఉండాల్సిందే. అయితే, కప్ కోసం ఇరు జట్లను నడిపిస్తున్న రోహిత్, శాంట్నర్ ఈనెల 23 నుంచి ఒకే టీమ్ కోసం ఆడనున్నారు. వీరిద్దరూ ఐపీఎల్లో MI జట్టు సభ్యులు కావడం విశేషం.
Similar News
News November 11, 2025
డ్రైవర్ అప్రమత్తతే 29 మందిని రక్షించింది!

TG: నల్గొండలోని చిట్యాల వద్ద <<18254484>>బస్సు<<>> దగ్ధమైన ఘటనలో డ్రైవర్ అప్రమత్తతే 29 మంది ప్రయాణికులను రక్షించింది. ప్రైవేట్ ట్రావెల్ బస్సులో మంటలు చెలరేగగా సకాలంలో స్పందించి ప్రయాణికులను అప్రమత్తం చేశారు. వెంటనే వారు బస్సు నుంచి దూకడంతో ప్రాణాలతో బయటపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. కాగా కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో డ్రైవర్ నిర్లక్ష్యమూ ఓ కారణమన్న సంగతి తెలిసిందే.
News November 11, 2025
‘ఓం శాంతి శాంతి శాంతిః’ అంటే అర్థం తెలుసా?

ప్రతి మంత్రాన్ని ‘ఓం శాంతి శాంతి శాంతిః’ అని ముగిస్తుంటాం. అంటే సమస్త దుఃఖాల నుంచి విముక్తి ప్రసాదించమని ఈశ్వరుడిని వేడుకోవడం. ఇందులో మూడు సార్లు ‘శాంతిః’ అని పలకడం ద్వారా మానవులను పీడించే త్రివిధ తాపాల నుంచి ఉపశమనం కోరడం. ఈ మూడు రకాల బాధలను దాటినప్పుడే మనకు మోక్షం, శాంతి లభిస్తాయని వేదాలు చెబుతున్నాయి. ☞ మరి ఆ మూడు రకాల తాపాలేంటి?, వాటి నుంచి ఎలా విముక్తి పొందాలో తెలుసుకోవడానికి <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>.
News November 11, 2025
అనారోగ్యం దూరమవ్వాలంటే?

త్రివిధ తాపాల్లో మొదటిది ఆధ్యాత్మిక తాపం. ఈ బాధలు మనకు శరీరం, మనస్సు వలన అంతర్గతంగా కలుగుతాయి. అనారోగ్యం, సోమరితనం, కోరికలు, కోపం, అహంకారం వంటి దుర్గుణాలు ఇందులోకి వస్తాయి. ఈ బాధల నుంచి విముక్తి పొందడానికి ధ్యానం ఉత్తమ మార్గం. యోగాభ్యాసం, మనస్సుపై ఏకాగ్రత, ఆత్మ జ్ఞానాన్ని పెంచుకోవడం ద్వారా అంతరంగంలో శాంతిని పొందవచ్చు. స్వీయ నియంత్రణ సాధించి, దుర్గుణాలను జయిస్తే ఆధ్యాత్మిక దుఃఖాలు తొలగిపోతాయి.


