News December 12, 2024
క్యాబినెట్ నిర్ణయంపై విపక్ష సీఎంల ఫైర్

జమిలి ఎన్నికల బిల్లుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలపడాన్ని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తప్పుబట్టారు. క్యాబినెట్ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమన్నారు. ఈ ఎన్నికల నిర్వహణ భారతదేశ ప్రజాస్వామ్యాన్ని అణగదొక్కే ప్రయత్నమని దుయ్యబట్టారు. మరోవైపు కేంద్రం తీసుకున్న నిర్ణయం ప్రతిపక్షాల గొంతు నొక్కేలా ఉందని, దీనిని వ్యతిరేకించాలని తమిళనాడు సీఎం స్టాలిన్ ట్వీట్ చేశారు.
Similar News
News January 11, 2026
సంక్రాంతి.. YCP vs TDP

సంక్రాంతి వేళ ఏపీకి వస్తున్న ప్రజలు సొంతూరి దుస్థితి చూసి నిట్టూరుస్తున్నారని YCP ట్వీట్ చేసింది. గుంతల రోడ్లు, మద్దతు ధర లేక రైతులు పంటను రోడ్లపై పారేస్తున్నారని ఓ ఫొటోను షేర్ చేసింది. ఏడాదిన్నరలోనే ఇలా భ్రష్టు పట్టించేశారేంటని మాట్లాడుకుంటున్నారని పేర్కొంది. దీనికి టీడీపీ కౌంటర్ ట్వీట్ చేసింది. పోలవరం, అమరావతి వేగంగా పూర్తవుతున్నాయని, ఏపీ పెట్టుబడులకు కేంద్రంగా మారిందని మరో ఫొటో షేర్ చేసింది.
News January 11, 2026
Bullet Train: ఆలస్యం ఖరీదు ₹88వేల కోట్లు!

ఇండియాలో తొలి బుల్లెట్ రైలు కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. ప్రాజెక్టు నాలుగేళ్లు ఆలస్యం కావడంతో నిర్మాణ వ్యయం ఏకంగా 83% పెరిగింది. దాదాపు ₹1.1 లక్షల కోట్లతో అనుమతులు ఇవ్వగా తాజాగా ₹1.98 లక్షల కోట్లకు అంచనా పెరిగింది. ఇప్పటిదాకా ₹85,801 కోట్లు ఖర్చయ్యాయి. సూరత్, బిలిమోరా మధ్య <<18733757>>తొలి విడతలో <<>>2027 ఆగస్టులో ట్రైన్ పట్టాలెక్కనుంది. 508KM మొత్తం ప్రాజెక్టు(ముంబై-అహ్మదాబాద్) 2029 డిసెంబర్కు పూర్తి కానుంది.
News January 11, 2026
మెగా158.. హీరోయిన్గా ఐశ్వర్యరాయ్?

చిరంజీవి తర్వాతి మూవీ బాబీ దర్శకత్వంలో తెరకెక్కనుందని తెలుస్తోంది. ఇందులో చిరు సరసన ఐశ్వర్యరాయ్ నటిస్తారని సినీవర్గాలు చెబుతున్నాయి. అదే నిజమైతే మెగాస్టార్తో మాజీ ప్రపంచసుందరి తొలిసారి నటించే అవకాశముంది. అటు ఈ మూవీలో మలయాళ స్టార్ మోహన్ లాల్ కీలక పాత్రలో నటిస్తారని ప్రచారం జరుగుతోంది. ఇంకా ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తారని టాక్. ఈ సారి మెగాస్టార్ మూవీ పాన్ ఇండియా లెవల్లో ఉండనున్నట్లు తెలుస్తోంది.


