News April 2, 2025
లాలూ కోరికను ప్రతిపక్షం తీర్చలేకపోయింది.. మేం తీరుస్తున్నాం: షా

వక్ఫ్ ఆస్తులు లూటీ కాకుండా ఉండేందుకు అత్యంత కఠినమైన చట్టాలు రావాలని ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ కోరుకున్నారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్సభలో గుర్తుచేశారు. ‘2013లో అప్పటి యూపీఏ సర్కారు సవరణ బిల్లును ప్లాన్ చేస్తే లాలూ స్వాగతించారు. ‘వక్ఫ్ బోర్డులో సభ్యులు చాలా భూముల్ని అమ్మేశారు. సవరణను మేం సమర్థిస్తున్నాం’ అని అన్నారు. ఆయన కోరికను మీరు నెరవేర్చలేదు. మోదీ చేశారు’ అని పేర్కొన్నారు.
Similar News
News September 11, 2025
4.61 ఎకరాలకు రూ.3,472 కోట్లు!

ముంబైలో RBI భారీ ధరకు 4.61 ఎకరాలను కొనుగోలు చేసింది. నారీమన్ పాయింట్లో ఉన్న ప్లాట్ కోసం ముంబై మెట్రో రైల్ కార్పొరేషన్ (MMRCL)కు ఏకంగా రూ.3,472 కోట్లు చెల్లించింది. అంటే ఒక ఎకరానికి దాదాపు రూ.800 కోట్లు. స్టాంప్ డ్యూటీకే రూ.208 కోట్లు అయ్యాయి. ఈ ఏడాది ఇండియాలో ఇదే అతిపెద్ద ల్యాండ్ ట్రాన్సాక్షన్ అని సమాచారం. ఆ ప్లాటు సమీపంలోనే బాంబే హైకోర్టు, ఇతర కార్పొరేట్ ప్రధాన కార్యాలయాలు ఉన్నాయి.
News September 11, 2025
ఏ వాస్తు శాస్త్రాన్ని ప్రామాణికంగా తీసుకోవాలి?

వాస్తు శాస్త్రంపై ఏ ఒక్క రుషి రచనను ప్రామాణికంగా తీసుకోవాలన్న సందేహం అవసరం లేదు. ఎందుకంటే మనం వేర్వేరు మార్గాల్లో వెళ్లినా చేరాల్సిన గమ్యం ఒక్కటే అయినట్లుగా.. ఏ వాస్తు శాస్త్రాన్ని అనుసరించినా దాని లక్ష్యం ఒకటే ఉంటుంది. అందరు మహర్షులు సమాజ హితం కోసమే ఈ రచనలు చేశారు. మీరు ఏ వాస్తు శాస్త్రాన్ని ఎంచుకున్నా అందులో సూత్రాలు మారవు. బాగా ప్రాచుర్యం పొందిన వాస్తు శాస్త్రాన్ని ఎంచుకోవడం మంచిది.
News September 11, 2025
వాస్తు శాస్త్రాన్ని అంత మంది రుషులు ఎందుకు రచించారు?

వాస్తు శాస్త్రం అనేది కేవలం ఓ వ్యక్తి ఆలోచన మాత్రమే కాదు. ఇది అనేకమంది రుషుల జ్ఞానం, అనుభవం నుంచి పుట్టింది. ఇతిహాసాలు, పురాణాలను ఎంతో మంది కవులు, పండితులు తమదైన శైలిలో రచించినట్లే వాస్తు శాస్త్రాన్ని కూడా ఎందరో మహర్షులు సమాజ శ్రేయస్సు కోసం రాశారు. వారి రచనల్లో పదాలు వేరుగా ఉన్నప్పటికీ, పరమార్థం ఒకటే ఉంటుంది. వీళ్లందరూ మానవుల జీవితం సుఖశాంతులతో సాగడానికి సరైన మార్గాన్ని చూపించారు.