News July 1, 2024

NEET UGపై చర్చకు విపక్షాల పట్టు

image

లోక్‌సభ సమావేశాల్లో NEET UGపై చర్చించాల్సిందేనని విపక్షాలు పట్టుబడుతున్నాయి. NEET UG, UG NET సహా పరీక్షల క్వశ్చన్ పేపర్ల లీకేజీలు, నిర్వహణలో NTA వైఫల్యంపై చర్చించేందుకు కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ లోక్‌సభలో వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. మరో ఎంపీ మాణిక్కం ఠాగూర్ సస్పెన్షన్‌ ఆఫ్ బిజినెస్ నోటీసు ఇచ్చారు.

Similar News

News February 21, 2025

OTTలోకి వచ్చేసిన ‘డాకు మహారాజ్’

image

బాబీ డైరెక్షన్‌లో బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన ‘డాకు మహారాజ్’ ఓటీటీలోకి వచ్చేసింది. నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. జనవరి 12న విడుదలైన ఈ చిత్రం దాదాపు రూ.170 కోట్ల కలెక్షన్లు వసూలు చేసిన విషయం తెలిసిందే. తమన్ మ్యూజిక్ అందించగా, బాబీ డియోల్, ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ కీలక పాత్రల్లో నటించారు.

News February 21, 2025

శివరాత్రి జాతరకు ఘనంగా ఏర్పాట్లు

image

TG: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర ఆలయం శివరాత్రి వేడుకకు ముస్తాబవుతోంది. ఈ నెల 25,26,27 తేదీలలో జాతర నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. సాంస్కృతిక కార్యక్రమాల కోసం గుడి చెరువు మైదానంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం తిప్పాపూర్ బస్టాండ్ నుంచి ప్రధాన ఆలయం వరకూ ఉచిత బస్సులను నడపనున్నట్లు అధికారులు తెలిపారు. 2వేల మంది పోలీసులతో బందోబస్తు చేపట్టనున్నారు.

News February 21, 2025

మా దేశంలో ఉండొద్దు.. బీబీసీకి అజెర్‌బైజాన్‌ ఆదేశాలు

image

తమ దేశంలోని కార్యాలయాలు మూసేసి వెళ్లిపోవాలని వార్తాసంస్థ బీబీసీని అజెర్‌బైజాన్ ఆదేశించింది. తమ చట్టప్రకారం కార్యాలయం నడిపే హక్కు ఆ సంస్థకు లేదని తేల్చిచెప్పింది. దీంతో తమ కార్యాలయం మూసేయక తప్పలేదని, మీడియా స్వేచ్ఛను అజెర్‌బైజాన్ తుంగలో తొక్కిందని బీబీసీ ఓ ప్రకటనలో ఆరోపించింది. బీబీసీ ఆ దేశంలో 1994 నుంచి పనిచేస్తోంది. మరోవైపు.. BBC ప్రతి అంశాన్నీ రాజకీయం చేస్తోందని అజెర్‌బైజాన్ మండిపడింది.

error: Content is protected !!