News December 25, 2024
ఆప్’సోపాల్: స్కీములే లేవంటూ షాకిచ్చిన సొంతశాఖ

ఎన్నికల షెడ్యూలు రాకముందే ఢిల్లీ రాజకీయాలు ముదురుపాకాన పడుతున్నాయి. మహిళలకు ₹2100/M, వయోవృద్ధులకు ఉచిత వైద్యం కల్పిస్తామని ఆప్ ప్రకటించింది. మళ్లీ అధికారం చేపట్టాకే ఇస్తామంటూ రిజిస్ట్రేషన్లను ఆరంభించింది. విచిత్రంగా రాష్ట్ర ప్రభుత్వం కింద పనిచేసే ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అవేవీ నిజం కావని పత్రికల్లో ప్రకటనలు ఇచ్చింది. ఆ స్కీములే లేవంటూ పేర్లు, పత్రాలూ ఎవరికీ ఇవ్వొద్దనడం వివాదానికి దారితీసింది.
Similar News
News January 7, 2026
సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు

<
News January 7, 2026
తేనెతో చర్మానికి తేమ

పొడిబారే చర్మతత్వానికి తేనె ప్యాక్లు వాడితే బాగా తేమగా మారుతుందంటున్నారు చర్మ నిపుణులు. పచ్చిపాలకు తేనె కలిపి ముఖానికి రాసి ఆరనిచ్చి కడిగితే చర్మం తేమగా మారుతుంది. అలాగే తేనె, కలబంద, పాలు కలిపి ముఖానికి రాసి ఆరనిచ్చి కడిగితే చర్మం తేమగా మారుతుంది. చెంచా చొప్పున తేనె, కలబంద గుజ్జుకు రెండు చుక్కలు ఏదైనా ఎసెన్షియల్ ఆయిల్ కలిపి ముఖానికి పూత వేయాలి. 10 నిమిషాల తర్వాత కడిగితే చర్మానికి తేమ అందుతుంది.
News January 7, 2026
TDP కొనసాగి ఉంటే గతంలోనే పోలవరం పూర్తయ్యేది: సీఎం

AP: వైసీపీ ప్రభుత్వం వల్ల పోలవరం ఆలస్యమైందని, టీడీపీ కొనసాగి ఉంటే గతంలోనే పూర్తయ్యేదని సీఎం చంద్రబాబు అన్నారు. వైసీపీ హయాంలో కనీసం డయాఫ్రమ్ వాల్ను కాపాడుకోలేకపోయారని విమర్శించారు. నిపుణుల సూచనలతో నిర్మిస్తున్న కొత్త డయాఫ్రమ్ వాల్ పనులు ఈ ఫిబ్రవరి 15 కల్లా పూర్తి చేస్తున్నామన్నారు. మెయిన్ డ్యామ్లోని ECRF-1 కంప్లీట్ చేశామని, వచ్చే ఏడాది మార్చి నాటికి గ్యాప్-2 పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.


