News November 10, 2024
రాజస్థాన్లో కాలేజీలకు కాషాయ రంగులు.. కాంగ్రెస్ విమర్శలు

కాలేజీలకు కాషాయ రంగులు వేయాలన్న రాజస్థాన్ ప్రభుత్వ ఆదేశాలు ప్రతిపక్షాల ఆగ్రహానికి దారితీశాయి. కాయకల్ప్ పథకం ద్వారా శాంతియుత వాతావరణం సృష్టించేందుకు పైలెట్ ప్రాజెక్టుగా 20 కాలేజీలకు కాషాయ రంగులు వేయాలని విద్యాశాఖ ఆదేశించింది. అయితే విద్యను కాషాయీకరణ చేస్తున్నారని కాంగ్రెస్ మండిపడింది. విద్యా వ్యవస్థల్లో ఉన్న సమస్యలు వదిలేసి రాజకీయాల కోసం ప్రజల డబ్బులు వెచ్చిస్తారా అని విమర్శించింది.
Similar News
News April 10, 2026
రోజూ పొద్దున్నే రాగి జావ తాగితే..

రాగుల్లో ప్రొటీన్స్, ఐరన్, ఫైబర్, అమైనో అమ్లాలు, విటమిన్ C, కాల్షియం అధికంగా ఉంటాయి. రోజూ పొద్దున్నే రాగి జావ తాగితే జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది. రక్తంలో హిమోగ్లోబిన్ పెరుగుతుంది. గ్లూకోజ్ స్థాయి తగ్గుతుంది. రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది. చర్మానికి నిగారింపు వస్తుంది. బరువు నియంత్రణలో ఉంటుంది. ముఖ్యంగా చిన్నపిల్లలు రోజూ ఈ జావను తీసుకుంటే ఎముకలు, కండరాలు దృఢంగా మారతాయి.
#ShareIt
News April 10, 2026
ధనుష్-కృతి.. మరోసారి జోడీ!

ధనుష్, కృతి సనన్ జోడీగా గతేడాది రిలీజైన ‘తేరే ఇష్క్ మే’ మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్రానికి ఆనంద్ ఎల్ రాయ్ డైరెక్షన్ చేశారు. ఈ ముగ్గురి కాంబినేషన్లో మరో సినిమా తెరకెక్కనున్నట్లు సమాచారం. పీరియాడికల్ లవ్ స్టోరీని దర్శకుడు సిద్ధం చేస్తున్నారని టాక్. ఈ ఏడాది చివర్లోనే షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉంది.
News April 10, 2026
IPL నుంచి హసరంగ ఔట్!

LSG స్టార్ స్పిన్నర్ హసరంగ గాయం కారణంగా ఐపీఎల్కు దూరమయ్యారు. ఆయన భారత్కు రాలేడనే అంచనాతో ఒకట్రెండు రోజుల్లో వేరే ప్లేయర్ను తీసుకోనున్నట్లు టీమ్ డైరెక్టర్ టామ్ మూడీ ప్రకటించారు. గతేడాది వేలంలో హసరంగను రూ.2 కోట్లకు LSG కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. గాయంతో బాధపడుతున్న ఆయన శ్రీలంక బోర్డు నుంచి NOC పొందలేదు. హసరంగ స్థానంలో దక్షిణాఫ్రికా స్పిన్నర్ జార్జ్ లిండేను తీసుకునే అవకాశం ఉంది.


