News April 13, 2025

Orange: HYDలో సరిపోయింది ఈ శనివారం

image

ఈ శనివారం HYD‌ వాసులకు గుర్తుండిపోయే రోజు. వీర హనుమాన్ విజయయాత్ర జరిగిన నగరంలోనే ఆరెంజ్ ఆర్మీ జైత్ర యాత్ర కొనసాగింది. ఉదయం నుంచి ఓ ఆర్మీ జై శ్రీరామ్ నినాదాలతో HYDను హోరెత్తించగా.. మరో ఆర్మీ ఉప్పల్ స్టేడియంలో చెలరేగిపోయింది. ఎటు చూసినా కాషాయజెండాలే దర్శనమిచ్చాయి. భక్తుల పూజలు, హనుమంతుడి అనుగ్రహంతో ఆరెంజ్ ఆర్మీ ఘన విజయం సాధించిందని హైదరాబాద్ ఫ్యాన్స్ ట్వీట్లు చేస్తున్నారు. దీనిపై మీ కామెంట్?

Similar News

News April 13, 2025

బాలానగర్‌ ఘటన.. మృతుడి వివరాలు (UPDATE)

image

బాలానగర్‌లో RTC బస్ కింద పడి ఓ బైకర్ మృతి చెందిన విషయం తెలిసిందే. మృతుడు AP కొనసీమ జిల్లాకు చెందిన జోష్ బాబు(బాబ్జీ)గా పోలీసులు గుర్తించారు. రన్నింగ్‌లో ఉన్న వెహికిల్‌ను ఆపే క్రమంలో ట్రాఫిక్ కానిస్టేబుల్ చొక్కా పట్టుకొని లాగారని PSలో మృతుడి కుటుంబీకులు ఫిర్యాదు చేశారు. కానిస్టేబుల్ నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందని ఆరోపించారు. సీసీ కెమెరాల ఆధారంగా బాలానగర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

News April 13, 2025

HYD: అశ్లీల చిత్రాలు చూస్తున్నారా? జాగ్రత్త..!

image

సెల్‌ఫోన్‌లో అశ్లీల చిత్రాలు చూసినా, ఇతరులకు షేర్ చేసినా శిక్షలు ఎదుర్కోవాల్సి వస్తుందని HYD టప్పాచబుత్రా పోలీసులు Xలో పోస్ట్ చేశారు. ఇటీవల HYD శివారు మిరుదొడ్డిలో యువకుడు అశ్లీల చిత్రాలు చూస్తూ SMలో పోస్ట్ చేశాడు. గుర్తించిన సైబర్ సెక్యూరిటీ అధికారులు అతడిని రిమాండ్ చేసి.. ఫోన్, సిమ్ స్వాధీనం చేసుకున్నారని అందులో పేర్కొన్నారు. లైక్‌ల కోసం వీటిని పోస్ట్ చేయొద్దని, SMని మంచికోసం వాడాలని సూచించారు.

News April 13, 2025

HYD: ప్రశాంతంగా ముగిసిన యాత్ర

image

నగరంలో శ్రీ వీర హనుమాన్ విజయయాత్ర శాంతియుతంగా ముగిసింది. ఏకంగా 17,000 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. సీపీ సీవీ ఆనంద్ పర్యవేక్షణలో డ్రోన్‌లు, సీసీటీవీలతో పర్యవేక్షణ జరిగింది. 45 ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు, జాయింట్ కంట్రోల్ రూమ్ ద్వారా అన్ని శాఖల సమన్వయంతో యాత్ర నిర్వహించారు. ప్రజలు, నిర్వాహకుల సహకారంతో యాత్ర ప్రశాంతంగా ముగిసిందని సీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు.

error: Content is protected !!