News September 4, 2025

‘సోనియాపై FIR నమోదుకు ఆదేశించండి’

image

కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీపై ఎఫ్ఐఆర్ నమోదుకు ఆదేశించాలని వికాస్ త్రిపాఠి ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించారు. 1980లో ఆమె భారత సిటిజన్ షిప్ లేకుండానే ఓటు నమోదు చేసుకున్నారని, ఉద్దేశపూర్వకంగా ఫోర్జరీ చేశారని ఆరోపించారు. 1982లో ఆమె ఓటును డిలీట్ చేసి 1983లో తిరిగి చేర్చారని పేర్కొన్నారు. దీనిపై కోర్టు విచారణను సెప్టెంబర్ 10కి వాయిదా వేసింది. కాగా సోనియాకు భారత పౌరసత్వం 1983లో లభించింది.

Similar News

News September 4, 2025

జాగృతిలో చీలికలు.. BRS కోసమే పనిచేస్తామంటున్న నేతలు

image

TG: బీఆర్ఎస్‌ను కవిత వీడటంతో దాని అనుబంధ సంస్థగా ఉన్న జాగృతిలో చీలికలు బయటపడుతున్నాయి. కవిత తమను నడిరోడ్డుపై పడేసిందని జాగృతి నేత రాజీవ్ సాగర్ ఆరోపించారు. బీఆర్ఎస్ కోసం పనిచేసే తెలంగాణ జాగృతి తమదేనని, కేసీఆర్ చెప్పిందే చేస్తామని చెప్పారు. తెలంగాణ జాగృతి బోర్డు పెట్టుకునే హక్కు తమకు ఉందన్నారు. దీనిపై జాగృతి ఫౌండర్ కవిత స్పందించాల్సి ఉంది.

News September 4, 2025

చైనా హ్యాకర్ల చేతిలో అమెరికన్ల డేటా!

image

అమెరికాను ‘సాల్ట్ టైఫూన్’ అనే పేరు భయపెడుతోంది. చైనాకు చెందిన ఈ సైబర్ ముఠా అమెరికాలోని ప్రతి పౌరుడి డేటాను హ్యాక్ చేసిందని సెక్యూరిటీ నిపుణులు భయపడుతున్నారు. ఈ ముఠా 2019 నుంచి 80 దేశాల్లో 200 కంపెనీలను లక్ష్యంగా చేసుకుందని చెబుతున్నారు. ఈ భారీ ఎటాక్ చైనా హ్యాకింగ్ సామర్థ్యాలను తెలియజేస్తోందని NYT కథనం పేర్కొంది. చైనా ప్రభుత్వమే వీరికి నిధులు ఇస్తుందని ఆరోపించింది.

News September 4, 2025

జీఎస్టీ తగ్గింపుతో సామాన్యులకు ఎన్ని రూ.వేలు సేవ్ అంటే?

image

పండగల వేళ GST శ్లాబులను తగ్గిస్తూ సామాన్యులకు కేంద్రం పెద్ద గిఫ్ట్ ఇచ్చింది. ఆహార పదార్థాలు, హెల్త్ ఇన్సూరెన్స్, ఇతరత్రా <<17605715>>వస్తువులపై<<>> GSTని తగ్గించడం బిగ్ రిలీఫ్ కలిగించింది. దీంతో మధ్య తరగతి కుటుంబాలకు ఏటా రూ.45వేలు ఆదా అవుతుందని ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. రూ.12 లక్షల వరకు ఇన్‌కమ్ ట్యాక్స్ లేదన్న గత ప్రకటనతో పాటు జీఎస్టీ ఆదా కలిపి ఏటా రూ.1.25లక్షలు సేవ్ అవుతాయని అంచనా వేస్తున్నారు.