News February 9, 2025
ఖైదీని వదిలేయాలంటూ రాష్ట్రపతి పేరిట ఆదేశాలు.. కానీ…

యూపీలోని సహరన్పూర్ జిల్లా జైల్లో ఓ ఆసక్తికర ఘటన జరిగింది. ఆ జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఓ ఖైదీని విడిచిపెట్టాలని ఆదేశిస్తూ ‘రాష్ట్రపతి కోర్టు’ పేరిట జైలు అధికారులకు లేఖ వచ్చింది. ఇదేం కోర్టు అంటూ వారు ఆరా తీయగా అసలు అలాంటి న్యాయస్థానమే లేదని తేలింది. దీంతో ఎవరో తప్పుడు పత్రాలతో ఆదేశాలు సృష్టించారని అర్థమై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేశామని, విచారణ జరుగుతోందని పోలీసులు తెలిపారు.
Similar News
News January 2, 2026
పాడి పశువుల పోషణలో పచ్చిమేత ప్రాముఖ్యత

పచ్చి మేతలో విటమిన్-A అధికంగా ఉంటుంది. దీని వల్ల పశువుల్లో వ్యాధి నిరోధక శక్తి పెరిగి ఆరోగ్యంగా ఉండి సకాలంలో యుక్త వయసుకు వచ్చి యద లక్షణాలు చూపించి చూలు కడతాయి. రైతు తనకున్న పొలంలో 1/10 వంతులో పశుగ్రాసాన్ని సాగు చేస్తే పశువుల పోషణ ఖర్చు 25-30 శాతం తగ్గి.. పాల నుంచి వచ్చే ఆదాయం 20-30% వరకు పెరుగుతుంది. పచ్చిమేత వల్ల పశువుల జీర్ణక్రియ మెరుగ్గా జరిగి పోషకాలు బాగా అంది పాల దిగుబడి కూడా పెరుగుతుంది.
News January 2, 2026
వంశీని అరెస్ట్ చేయవద్దు.. హైకోర్టు ఆదేశం

AP: మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి హైకోర్టులో ఊరట లభించింది. ఆయనను అరెస్ట్ చేయవద్దంటూ న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. విజయవాడ మాచవరం పీఎస్లో వంశీపై హత్యాయత్నం కేసు నమోదు కాగా ముందస్తు బెయిల్ కోసం ఆయన కోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన ధర్మాసనం ఈమేరకు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.
News January 2, 2026
శనగపిండితో చర్మానికి ఎన్నో లాభాలు

శనగపిండిలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి చర్మంపై జిడ్డు, మొటిమలను తగ్గించి చర్మ రంధ్రాలను శుభ్రపరచడంలో సాయపడతాయంటున్నారు నిపుణులు. ఇది చర్మాన్ని మృదువుగా, ప్రకాశవంతంగా మార్చే క్లెన్సర్గానూ పనిచేస్తుంది. ముడతలు తగ్గించి, చర్మాన్ని బిగుతుగా మార్చేస్తుంది. దీనికి గంధం, పాలు, ముల్తానీ మట్టి, కాఫీ పొడి, నిమ్మరసం, పెరుగు, తేనె, పసుపు వంటివి కలిపి రాస్తే అదనపు ప్రయోజనాలుంటాయి.


