News September 24, 2024
ఆర్థిక సాయం పెంచుతూ ఉత్తర్వులు

AP: వరదల కారణంగా నష్టపోయిన వారికి రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ నిర్దేశించిన దానికంటే ఆర్థిక సాయాన్ని పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విజయవాడలో ఇళ్లు పూర్తిగా నీట మునిగిన బాధితులకు రూ.11వేలకు బదులుగా రూ.25 వేలు ఇవ్వనున్నారు. మొదటి ఫ్లోర్లో ఉన్నవారికి రూ.10 వేలు, దుకాణాలకు, పంటలకు హెక్టారుకు రూ.25 వేలు అందించనున్నారు. ఇళ్లు ధ్వంసమైన వారికి ప్రభుత్వం కొత్త ఇంటిని నిర్మించి ఇవ్వనుంది.
Similar News
News October 31, 2025
మంత్రివర్గంలోకి మరో ఇద్దరు!

TG: రాష్ట్ర మంత్రిగా అజహరుద్దీన్ ఇవాళ మ.12.15 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. DEC తర్వాత మరో ఇద్దరు క్యాబినెట్లో చేరుతారని TPCC చీఫ్ మహేశ్ కుమార్ తెలిపారు. దీనిపై CM రేవంత్ రెడ్డి, అధిష్ఠానం త్వరలో నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు. ఇక మంత్రివర్గ విస్తరణను అడ్డుకునేందుకు BJP ప్రయత్నిస్తోందని విమర్శించారు. జూబ్లీహిల్స్లో BRSను గెలిపించడమే ఆ పార్టీ లక్ష్యమని మహేశ్ ఆరోపించారు.
News October 31, 2025
క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించే ద్రాక్ష

ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ బారిన పడేవారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అయితే క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకోవడంలో ద్రాక్ష పండు సాయపడుతున్నట్లు తాజా పరిశోధనలో తేలింది. లండన్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు చేసిన తాజా అధ్యయనంలో ద్రాక్షలో ఉండే రెస్వెరాట్రాల్ అనే పాలీఫెనాల్ క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకోవడంతో పాటు అవి ఇతర భాగాలకు వ్యాపించకుండా నిరోధించడంలో సహాయపడుతుందని గుర్తించారు.
News October 31, 2025
VIRAL: అప్పుడు గంభీర్.. ఇప్పుడు జెమీమా

ఉమెన్స్ ODI వరల్డ్ కప్ సెమీస్లో ఆస్ట్రేలియాపై సెంచరీ చేసిన జెమీమా రోడ్రిగ్స్ను నెటిజన్లు గంభీర్తో పోలుస్తున్నారు. 2011 WC ఫైనల్లో మూడో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన గంభీర్ 97 రన్స్ చేసి IND విజయంలో కీలక పాత్ర పోషించారు. నిన్నటి మ్యాచులో జెమీమా సైతం మూడో స్థానంలోనే బ్యాటింగ్ చేశారు. ఇద్దరి జెర్సీ నంబర్ ఒకటే కావడం(5), ఇద్దరి జెర్సీలకు మట్టి ఉండటంతో వారి ఫొటోలను నెటిజన్లు వైరల్ చేస్తున్నారు.


