News May 19, 2024
రబీ పంట నష్టం గణనపై ఉత్తర్వులు

AP: ఈ నెల 24లోగా రబీ పంట నష్టం గణన పూర్తి చేయాలని వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్ అధికారులను ఆదేశించారు. కర్నూలు, శ్రీ సత్యసాయి, OGL, నెల్లూరు జిల్లాలో 87 కరువు మండలాలను ప్రభుత్వం ప్రకటించింది. ఈ మండలాల్లో 33%పైగా దెబ్బతిన్న పంటల వివరాలు నమోదు చేయాలన్నారు. ఒక్కో రైతుకు అయిదెకరాలకు మించకూడదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ నెల 25 నుంచి 27 వరకు RBKల్లో అభ్యంతరాల స్వీకరణ.. 31న తుది జాబితా ప్రకటిస్తారు.
Similar News
News December 6, 2025
జీఎస్టీ&సెంట్రల్ ఎక్సైజ్ చెన్నైలో ఉద్యోగాలు

జీఎస్టీ కమిషనర్&సెంట్రల్ ఎక్సైజ్, చెన్నై స్పోర్ట్స్ కోటాలో 20 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో ట్యాక్స్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, హవల్దార్, MTS పోస్టులు ఉన్నాయి. క్రీడల్లో జాతీయ, అంతర్జాతీయ, యూనివర్సిటీ స్థాయిలో పతకాలు సాధించిన వారు డిసెంబర్ 18 నుంచి జనవరి 7వరకు అప్లై చేసుకోవచ్చు. వెబ్సైట్: https://gstchennai.gov.in/
News December 6, 2025
‘రైట్ టు డిస్కనెక్ట్’.. ఏ దేశాల్లో అమల్లో ఉంది?

పని వేళలు పూర్తయ్యాక ఉద్యోగులు ఆఫీస్ కాల్స్ను <<18487853>>డిస్ కనెక్ట్<<>> చేసే హక్కును 2017లో ఫ్రాన్స్ చట్టబద్ధం చేసింది. ఆ తర్వాత స్పెయిన్, ఇటలీ, ఐర్లాండ్, బెల్జియం దేశాలు ఈ తరహా చట్టాలను తీసుకొచ్చాయి. ఇది ఉద్యోగుల వర్క్ లైఫ్ బ్యాలెన్స్, మెంటల్ హెల్త్, వారి శ్రేయస్సు, ప్రొడక్టివిటీకి ముఖ్యమని పేర్కొన్నాయి. ఇండియాలోనూ 2018, 2025లో ఇలాంటి ప్రైవేట్ బిల్లులు ప్రవేశపెట్టారు. కానీ చట్టరూపం దాల్చలేదు.
News December 6, 2025
TGపై పవన్ వ్యాఖ్యలు సరికాదు: ఉండవల్లి

AP: తెలంగాణపై పవన్ కళ్యాణ్ <<18394542>>దిష్టి<<>> వ్యాఖ్యలు సరికాదని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. డిప్యూటీ సీఎం స్థాయి నేత మాట్లాడేటప్పుడు ఆలోచించుకోవాలని హితవు పలికారు. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులు తీసుకొస్తున్న చంద్రబాబు తన వ్యాపారాలను ఏపీకి ఎందుకు తీసుకురావట్లేదని ప్రశ్నించారు. BJP, జనసేన, TDP పొత్తు ఎంతకాలం కొనసాగుతుందో చూడాలన్నారు. మరోవైపు అమరావతి రాజధానికి తాను వ్యతిరేకం కాదన్నారు.


