News March 2, 2025
శాసనసభ, మండలి ప్రోరోగ్ చేస్తూ ఆదేశాలు

తెలంగాణ శాసనసభ, శాసనమండలిని ప్రోరోగ్ చేస్తూ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ నోటిఫికేషన్ జారీ చేశారు. ప్రోరోగ్ చేయకుండానే డిసెంబర్ నుంచి మాజీ ప్రధాని మన్మోహన్ మృతికి సంతాపం, ఎస్సీ వర్గీకరణ, కులగణన నివేదికలపై ప్రకటనలు చేశారు. ఈ నెలలో బడ్జెట్ సమావేశాలు జరగనుండగా, వాటిని ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించాల్సి ఉంటుంది. దీంతో సభను ప్రోరోగ్ చేయగా, త్వరలోనే శాసనసభ, మండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి.
Similar News
News November 22, 2025
సున్నాకే 2 వికెట్లు.. వైభవ్ సూర్యవంశీని ఎందుకు ఆడించలేదు?

ACC రైజింగ్ స్టార్స్ టోర్నీ సెమీస్లో భారత్-A ఘోరంగా ఓడిపోవడం తెలిసిందే. <<18351593>>సూపర్ ఓవర్లో<<>> ఇండియా సున్నాకే 2 వికెట్లు కోల్పోవడంతో బంగ్లా ఈజీగా గెలిచేసింది. ఈ నేపథ్యంలో ఫామ్లో ఉన్న వైభవ్ సూర్యవంశీని సూపర్ ఓవర్లో ఎందుకు బ్యాటింగ్కు పంపలేదని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఈ బ్లండర్ మిస్టేక్ వల్ల మ్యాచ్ ఓడిపోయామని మండిపడుతున్నారు. వైభవ్ ఆడుంటే ఇంకోలా ఉండేదని అంటున్నారు. మీరేమంటారు?
News November 22, 2025
అధికారి కొడుకు, కూలీ కొడుకు పోటీ పడేలా చేయలేం: సీజేఐ

SC, ST రిజర్వేషన్ల ఉప వర్గీకరణపై తన తీర్పుకు కట్టుబడి ఉన్నానని CJI జస్టిస్ గవాయ్ స్పష్టం చేశారు. సీఎస్ కొడుకును వ్యవసాయ కూలీ కొడుకుతో పోటీ పడేలా చేయలేమని అన్నారు. ‘ఆర్టికల్ 14 సమానత్వాన్ని నమ్ముతుంది. అంటే అందరినీ సమానంగా చూడాలని కాదు. వెనుకబడిన వారిని ప్రత్యేకంగా ట్రీట్ చేయాలి. సమానత్వ భావనంటే ఇదే’ అని చెప్పారు. తన చివరి వర్కింగ్ డే సందర్భంగా వీడ్కోలు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
News November 22, 2025
peace deal: ఉక్రెయిన్ను బెదిరించి ఒప్పిస్తున్న అమెరికా!

రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేందుకు అమెరికా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి 28 పాయింట్లతో కూడిన <<18346240>>పీస్ ప్లాన్<<>>ను అందజేసింది. అయితే దీన్ని అంగీకరించాలని ఉక్రెయిన్పై ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది. లేదంటే నిఘా సమాచారం, ఆయుధాల సరఫరాలను తగ్గిస్తామని బెదిరించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. వచ్చే గురువారం లోగా ఒప్పందంపై సంతకం చేయాలని చెప్పినట్లు తెలిపాయి.


