News March 22, 2025
ORRపై ఘోర రోడ్డుప్రమాదం.. నల్గొండ అమ్మాయి మృతి

రోడ్డుప్రమాదంలో నల్గొండకు చెందిన యువతి మృతిచెందిన ఘటన తెల్లవారుజామున జరిగింది. స్థానికుల వివరాలిలా.. HYDలో MBBS చేస్తున్న తన చెల్లిని తీసుకురావడానికి నల్గొండ నుంచి ఇద్దరు అన్నదమ్ములు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో ORRపై కారు టైర్ పగలడంతో రోడ్డు ప్రమాదం జరిగింది. ఘటనా స్థలంలోనే యువతి చనిపోగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వారు నల్గొండలోని మీర్ బాగ్, రహమాన్ బాగ్కు చెందిన వారిగా గుర్తించారు.
Similar News
News November 18, 2025
MDK: వైద్య కళాశాలను తనిఖీ చేసిన కలెక్టర్

మెదక్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలను కలెక్టర్ రాహుల్ రాజ్ సందర్శించి తరగతి గదులు, ల్యాబ్లను పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడి వారి అభిప్రాయాలు, అవసరాలు తెలుసుకున్నారు. విద్యా ప్రమాణాలు, వసతుల మెరుగుదలకు సూచనలు ఇచ్చి అధికారులను అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
News November 18, 2025
పెద్దపల్లి: పత్తి రైతుల సమస్యలపై కేంద్ర మంత్రికి ఎంపీ లేఖ

తెలంగాణ పత్తి రైతుల సమస్యలపై కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్కు లేఖ రాసినట్లు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ మంగళవారం తెలిపారు. రాష్ట్ర సగటు పత్తి దిగుబడిని 11.74 క్వింటాళ్లుగా కొనసాగించాలని, అలాగే పత్తిలో మాయిశ్చర్ పరిమితిని 20 శాతం వరకు సడలించాలని లేఖలో విజ్ఞప్తి చేసినట్లు పేర్కొన్నారు. మిల్లర్లు అండ్ ట్రేడర్స్ అసోసియేషన్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కూడా ఎంపీ కోరినట్లు తెలిపారు.
News November 18, 2025
మెదక్: బాలుడిపై దాడి చేసిన పినతండ్రి అరెస్ట్.. రిమాండ్కు తరలింపు

మద్యం మత్తులో బాలుడిపై దాడి చేసిన పిన తండ్రిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు రామాయంపేట ఎస్ఐ బాలరాజు తెలిపారు. అక్కన్నపేటకు చెందిన ముత్యం సత్యనారాయణ, వంశి అనే బాలుడిని ఈనెల 13న మద్యం మత్తులో విచక్షణ రహితంగా దాడి చేశాడు. బాధితుడి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సత్యనారాయణను మంగళవారం రిమాండ్కు తరలించారు.


