News March 22, 2025

ORRపై ఘోర రోడ్డుప్రమాదం.. నల్గొండ అమ్మాయి మృతి

image

రోడ్డుప్రమాదంలో నల్గొండకు చెందిన యువతి మృతిచెందిన ఘటన తెల్లవారుజామున జరిగింది. స్థానికుల వివరాలిలా.. HYDలో MBBS చేస్తున్న తన చెల్లిని తీసుకురావడానికి నల్గొండ నుంచి ఇద్దరు అన్నదమ్ములు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో ORRపై కారు టైర్ పగలడంతో రోడ్డు ప్రమాదం జరిగింది. ఘటనా స్థలంలోనే యువతి చనిపోగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వారు నల్గొండలోని మీర్ బాగ్, రహమాన్ బాగ్‌కు చెందిన వారిగా గుర్తించారు.

Similar News

News November 3, 2025

కంకర ఓవర్ లోడ్ కారణంగానే ప్రమాదం!

image

TG: చేవెళ్ల బస్సు ప్రమాదానికి సంబంధించి కీలకాంశాలు వెలుగులోకి వచ్చాయి. కంకర ఓవర్‌లోడ్‌ కారణంగానే ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ‎‎ఘటనా సమయంలో టిప్పర్‌లోనే యజమాని లక్ష్మణ్‌ ఉన్నారు. లడారం-శంకర్‌పల్లి వరకు టిప్పర్‌ను ఆయనే నడిపారు. ‎ఆ తర్వాత డ్రైవర్‌ ఆకాశ్‌కు ఇచ్చారు. గాయపడిన లక్ష్మణ్‌ నిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. కండక్టర్ రాధ ఫిర్యాదుతో చేవెళ్ల పోలీసులు కేసు నమోదు చేశారు.

News November 3, 2025

భక్తుల భద్రతకు పెద్దపీట వేయాలి

image

ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కార్తీక పౌర్ణమి సందర్భంగా పెద్ద ఎత్తున ఆలయాలకు భక్తులు తరలివస్తారని, భద్రత చర్యలకు పెద్దపీట వేయాలని దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ సూచించారు. జిల్లా దేవాదాయ శాఖ, పాలకమండలి అధ్యక్షులతో సమీక్ష నిర్వహించారు. ఎక్కువ మంది భక్తులు వచ్చే దేవాదాయ శాఖ, ప్రైవేట్ ఆలయాల్లో క్యూ లైన్, మార్గాల తదితర ఏర్పాట్లపై పోలీసుల సహకారంతో జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.

News November 3, 2025

ఢిల్లీలో కాలుష్య నివారణ చర్యలపై అఫిడవిట్ ఇవ్వండి: సుప్రీం

image

ఢిల్లీలో వాయుకాలుష్య నివారణకు తీసుకుంటున్న చర్యలపై అఫిడవిట్ సమర్పించాలని సుప్రీంకోర్టు కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంటును ఆదేశించింది. వాయు పర్యవేక్షణ కేంద్రాలు పనిచేయడం లేదన్న మీడియా వార్తలపై ప్రశ్నించింది. CPCB, DPCC, NCR పరిధిలోకి వచ్చే జిల్లాల్లో OCT 14-25 మధ్య పరీక్షించిన గాలి నాణ్యత నివేదికల్ని సమర్పించాలని చెప్పింది. CJI గవాయ్, జస్టిస్ వినోద్ చంద్రన్ ఈ కేసును విచారించి ఆదేశాలిచ్చారు.