News January 30, 2025
ప్రపంచస్థాయిలో ‘ఉస్మానియా’ ఆస్పత్రి: మంత్రి రాజనర్సింహ

TG: ఉస్మానియా కొత్త ఆస్పత్రిని ప్రపంచస్థాయిలో నిర్మిస్తామని మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. 26.3 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తామన్నారు. ‘అంతర్జాతీయ ప్రమాణాలతో, అత్యాధునిక టెక్నాలజీతో అందుబాటులోకి తీసుకొస్తాం. ఆస్పత్రిలో 2 వేల పడకలు ఉంటాయి. ప్రతి గదిలో గాలి, వెలుతురు వచ్చేలా నిర్మిస్తాం. విశాలమైన రోడ్లు, పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేస్తాం. లేటెస్ట్ టెక్నాలజీతో మార్చురీ నిర్మిస్తాం’ అని చెప్పారు.
Similar News
News December 4, 2025
భారీ జీతంతో ఉద్యోగాలు

తెహ్రీ హైడ్రో డెవలప్మెంట్ కార్పొరేషన్ (<
News December 4, 2025
తల్లిపై కూతురు పోటీ.. విషాదాంతం

TG: రాజకీయాలు కుటుంబ సంబంధాలనూ విచ్ఛిన్నం చేస్తున్నాయి. నల్గొండ(D) ఏపూరులో తల్లీకూతురు మధ్య నెలకొన్న రాజకీయ వివాదం విషాదాంతమైంది. 3వ వార్డు అభ్యర్థులుగా తల్లి లక్ష్మమ్మను BRS, ఆమె కూతురు అశ్వినిని కాంగ్రెస్ బలపరిచింది. ఈ క్రమంలో కూతురు నామినేషన్ ఉపసంహరించుకున్నప్పటికీ ఫ్యామిలీ గొడవలు తారస్థాయికి చేరాయి. దీంతో లక్ష్మమ్మ ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News December 4, 2025
సుష్మా స్వరాజ్ భర్త కన్నుమూత

కేంద్ర మాజీ మంత్రి, దివంగత సుష్మా స్వరాజ్ భర్త కౌశల్ స్వరాజ్(73) అనారోగ్యంతో కన్నుమూశారు. ఢిల్లీలోని లోధి రోడ్డులో ఇవాళ ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు బీజేపీ తెలిపింది. సీనియర్ న్యాయవాది అయిన కౌశల్ గతంలో మిజోరం గవర్నర్గా పనిచేశారు. కాగా 2019 ఆగస్టు 6న సుష్మా స్వరాజ్ కన్నుమూశారు. సుష్మా-కౌశల్ దంపతులకు బన్సూరి స్వరాజ్ అనే కూతురు ఉన్నారు. ఆమె ప్రస్తుతం బీజేపీ ఎంపీగా సేవలందిస్తున్నారు.


