News March 28, 2024
ఇంటర్ బోర్డు సిబ్బందికి OT పునరుద్ధరణ!

TG: ఇంటర్ పరీక్షల సమయంలో అదనంగా పనిచేసిన సిబ్బందికి ఓవర్ టైమ్(OT) అలవెన్స్ను పునరుద్ధరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత ఏడాది దీన్ని నిలిపివేయగా, ఉద్యోగుల వినతితో ఈ ఏడాది నుంచి ఇవ్వడానికి అంగీకరించింది. పబ్లిక్ పరీక్షల సమయంలో 40 రోజులు, సప్లిమెంటరీ ఎగ్జామ్స్ టైమ్లో 30 రోజులు కలిపి మొత్తం 70 రోజులకు బేసిక్ పే, డీఏతో ఓటీ అలవెన్స్ ఇవ్వనుంది. త్వరలోనే ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు సమాచారం.
Similar News
News February 9, 2026
ఎంత పడుకున్నా అలసట తీరట్లేదా?

రాత్రిళ్లు హాయిగా పడుకున్నా ఉదయం నిద్ర మత్తుగా ఉండటానికి విటమిన్ డీ లోపమే కారణమంటున్నారు నిపుణులు. ఇది మూడ్, శక్తిని నియంత్రించే సెరోటోనిన్ అనే న్యూరోట్రాన్స్మిటర్ ఉత్పత్తికి కూడా సహాయపడుతుంది. మధ్యాహ్నం సమయంలో శరీరంలో కార్టిసాల్ హార్మోన్ స్థాయి సహజంగా తగ్గుతుంది. ఇలాంటప్పుడు విటమిన్ D లోపం ఉంటే నీరసం, నిద్ర వచ్చినట్లుగా అనిపిస్తుంది. కాబట్టి విటమిన్ D సప్లిమెంట్స్, సమతుల్య ఆహారం తీసుకోవాలి.
News February 9, 2026
‘నో ఫోన్ ఛాలెంజ్’.. మీ పిల్లలకూ విసరండి!

విద్యార్థులు ఫోన్లకు బానిసలవకుండా కేరళలోని కూతుపరంబ స్కూల్ టీచర్ అమృత ‘నో ఫోన్ ఛాలెంజ్’ ప్రారంభించారు. ఫోన్ ముట్టుకోని పిల్లలకు స్టిక్కర్లు, ఇతర వస్తువులను బహుమతిగా ఇవ్వడం మొదలుపెట్టారు. ఇది పిల్లల్లో సానుకూల పోటీని పెంచింది. మీరూ ఇంట్లో పిల్లలు ఫోన్ చూడకుండా ఉండేందుకు ఈ ఛాలెంజ్ను ట్రై చేయండి. రోజంతా ఫోన్ చూడకుంటే బహుమతి ఇస్తామని చెప్పండి. ఆ సమయాన్ని క్రియేటివ్ వర్క్స్పై ఉపయోగించేలా చూడండి.
News February 9, 2026
డిజిటల్ మోసాలపై కఠిన చర్యలకు SC ఆదేశాలు

డిజిటల్ ఆర్థిక మోసాలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బ్యాంకు అధికారుల నిర్లక్ష్యమే ఇందుకు కారణమని పేర్కొంది. డిజిటల్ మోసాల ద్వారా రూ.54 వేల కోట్లకు పైగా కొల్లగొట్టడాన్ని దోపిడీగా అభిప్రాయపడింది. డిజిటల్ అరెస్ట్ కేసులపై దర్యాప్తు చేయాలని సీబీఐకి ఆదేశాలు ఇచ్చింది. అదే విధంగా మోసాల నివారణకు RBI రూపొందించిన ఎస్ఓపీని (Standard Operating Procedure) అమలు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది.


