News March 28, 2024
ఇంటర్ బోర్డు సిబ్బందికి OT పునరుద్ధరణ!

TG: ఇంటర్ పరీక్షల సమయంలో అదనంగా పనిచేసిన సిబ్బందికి ఓవర్ టైమ్(OT) అలవెన్స్ను పునరుద్ధరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత ఏడాది దీన్ని నిలిపివేయగా, ఉద్యోగుల వినతితో ఈ ఏడాది నుంచి ఇవ్వడానికి అంగీకరించింది. పబ్లిక్ పరీక్షల సమయంలో 40 రోజులు, సప్లిమెంటరీ ఎగ్జామ్స్ టైమ్లో 30 రోజులు కలిపి మొత్తం 70 రోజులకు బేసిక్ పే, డీఏతో ఓటీ అలవెన్స్ ఇవ్వనుంది. త్వరలోనే ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు సమాచారం.
Similar News
News March 31, 2026
యుద్ధం ముంచేసింది.. మార్చిలో ₹51లక్షల కోట్లు ఆవిరి

మార్చి నెల దేశీయ స్టాక్ మార్కెట్లకు ఓ పీడ కలగా మిగిలిపోయింది. పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో ఈనెలలో సెన్సెక్స్ 9,340 పాయింట్లు (11.5%).. నిఫ్టీ 2850 పాయింట్లు (11.3%) క్షీణించాయి. ₹51లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. గత 2 రోజుల్లోనే ₹18.60లక్షల కోట్ల నష్టం వచ్చింది. ఇక 2025-26 ఆర్థిక సంవత్సరంలో మార్కెట్ సంపద ₹46వేలకోట్లకుపైన తగ్గింది. కాగా ఈరోజు మహావీర్ జయంతి కారణంగా మార్కెట్లకు సెలవు.
News March 31, 2026
తొలిసారి ధోనీ, రైనా లేకుండా..

IPL-2026 సీజన్లో నిన్న తొలి మ్యాచ్ ఆడిన CSK రాజస్థాన్ చేతిలో <<19519904>>ఘోర<<>> ఓటమిపాలైంది. అయితే 277 మ్యాచుల తర్వాత ధోనీ, రైనా లేకుండా ఆ జట్టు బరిలోకి దిగడం గమనార్హం. ఇందులో 253 IPL, 24 ఛాంపియన్స్ లీగ్ T20 మ్యాచులున్నాయి. వీటన్నింటిలోనూ ధోనీ లేదా రైనా ఉన్నారు. IPL నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన రైనా, 2021లో చివరి మ్యాచ్ ఆడారు. ఇక <<19508727>>గాయం<<>> కారణంగా ఈ సీజన్లో కొన్ని మ్యాచులకు ధోనీ దూరమయ్యారు.
News March 31, 2026
అడుగంటిన నీటి నిల్వలు.. శ్రీశైలంలో నిలిచిపోయిన విద్యుత్ ఉత్పత్తి

AP: శ్రీశైలం జలాశయంలో నీటి నిల్వలు అడుగంటాయి. ప్రస్తుతం రిజర్వాయర్లో 44 TMCల నీరే ఉంది. దీంతో ఇరు రాష్ట్రాలు విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేశాయి. గత పది నెలల్లో కుడి గట్టులో ఏపీ 2060 మిలియన్ యూనిట్లు, ఎడమ గట్టులో TG 2,725 మిలియన్ యూనిట్ల విద్యుత్ను ఉత్పత్తి చేశాయి. విభజన తర్వాత ఇరు రాష్ట్రాలు ఈ స్థాయిలో ఉత్పత్తి చేయడం ఇదే తొలిసారి. ఉమ్మడి ఏపీలో 2007-08లో 2,544 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి అయింది.


