News October 24, 2024

OTD: సచిన్ రికార్డును బ్రేక్ చేసిన కోహ్లీ

image

టీమ్ఇండియా రన్ మెషీన్ విరాట్ కోహ్లీ వన్డేల్లో అత్యంత వేగంగా 10వేల పరుగులు పూర్తిచేసి నేటికి ఆరేళ్లు పూర్తవుతోంది. 2018లో ఇదేరోజున స్వదేశంలో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో 129 బంతుల్లో 157 రన్స్ చేశారు. దీంతో వన్డేల్లో 10,000కు పైగా పరుగులు చేసిన 12వ బ్యాటర్‌గా కోహ్లీ నిలిచారు. 205 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనత సాధించడంతో సచిన్ టెండూల్కర్‌(259) పేరిట ఉన్న రికార్డును ఆయన అధిగమించారు.

Similar News

News December 24, 2025

ఉద్యాన సాగు విస్తరణకు జిల్లాలో కొత్త ప్రణాళికలు: కలెక్టర్

image

ఉద్యాన పంటల విస్తరణ దిశగా జిల్లా కొత్త అడుగులు వేస్తోంది. జిల్లాలో కొత్తగా 10 వేల ఎకరాల్లో ఉద్యాన సాగుకు విజయనగరం కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి ప్రణాళికలు రూపొందించారు. రబీ సీజన్‌లో 4,000 ఎకరాలు, ఖరీఫ్‌లో 6,000 ఎకరాలు అదనంగా సాగులోకి తేవాలని ప్రతిపాదించారు. ఈ అంశాలపై బుధవారం డీఆర్డీఏ, వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు.

News December 24, 2025

చేవెళ్ల ప్రమాదం.. ప్రధాన నిందితుడిగా టిప్పర్ ఓనర్

image

TG: చేవెళ్ల సమీపంలోని మీర్జాగూడ వద్ద NOV 3న RTC బస్సు-టిప్పర్ ఢీకొన్న <<18212535>>ఘటనలో<<>> టిప్పర్ డ్రైవర్ సహా18 మంది ప్రయాణికులు మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ కేసులో టిప్పర్ ఓనర్ లచ్చు నాయక్‌ను పోలీసులు తాజాగా ప్రధాన నిందితుడిగా చేర్చారు. టిప్పర్ ఓవర్ లోడే ప్రమాదానికి కారణమని, ఆ సమయంలో అతడు టిప్పర్‌లోనే ఉన్నాడని తేల్చారు. ఈ ప్రమాదంలో గాయపడిన లచ్చు నాయక్ ప్రస్తుతం కోలుకుంటున్నాడు.

News December 24, 2025

మాల్యా భారత్‌కు ఎప్పుడు వస్తారు: బాంబే హైకోర్టు

image

బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి బ్రిటన్‌కు పారిపోయిన విజయ్ మాల్యాకు బాంబే హైకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. “భారత్‌కు ఎప్పుడు వస్తారు?” అనేది రాతపూర్వక అఫిడవిట్ ఇవ్వాలని ఆదేశించింది. విదేశాల్లో ఉంటూ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్లను విచారించబోమని స్పష్టం చేసింది. నేర విచారణ నుంచి తప్పించుకుని.. విదేశాల్లో ఉంటూ చట్టాన్ని సవాలు చేయడం సరికాదని ఈడీ తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాదించారు.