News March 26, 2025

రాష్ట్రవ్యాప్తంగా ULBల్లో ఓటీఎస్ అమలు

image

TG: జీహెచ్ఎంసీతో సహా అర్బన్ లోకల్ బాడీ(ULB)ల్లో ఆస్తి పన్నుపై వడ్డీ చెల్లింపునకు ‘వన్ టైం సెటిల్‌మెంట్(OTS)’ పథకాన్ని పురపాలక మంత్రిత్వ శాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ నెల 31 నాటికి ఆస్తిపన్ను బకాయిలు, పెనాల్టీలపై 90 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది.

Similar News

News December 19, 2025

ఐ మేకప్ వేసుకొనే ముందు

image

కాజల్, మస్కారా, ఐలైనర్, ఐషాడోలను ప్రతిరోజూ అప్లై చేయడం వల్ల కళ్ళకు హాని కలుగుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అంతే కాదు, ఇది ఎక్కువసేపు కళ్ళ పైన ఉండటం వల్ల వాటిలోని రసాయనాలు, ప్రిజర్వేటివ్‌లు కళ్ళ మెరుపును తగ్గిస్తాయంటున్నారు. అలాగే ఐ మేకప్ ప్రొడక్ట్స్ వాడే ముందు చేతులు శుభ్రం చేసుకోవడం, వాటిని ఇతరులతో పంచుకోకపోవడం మంచిదని సూచిస్తున్నారు. లేదంటే ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదముందంటున్నారు.

News December 19, 2025

పూర్వోదయ, సాస్కీ పథకాలతో చేయూత ఇవ్వండి: సీఎం

image

AP: ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. పూర్వోదయ, సాస్కీ పథకాల ద్వారా రాష్ట్రానికి చేయూత ఇవ్వాలని కోరారు. రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు వచ్చే బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టుకు చేయూత అందించాలని వినతి పత్రం అందజేశారు. కేంద్ర పథకాలకు సంబంధించి పెండింగ్ నిధులను విడుదల చేయాలని విన్నవించారు.

News December 19, 2025

భార్యను చంపి 72 ముక్కలు.. హైకోర్టు తీర్పు ఇదే

image

డెహ్రాడూన్‌లో భార్యను చంపి 72 ముక్కలుగా నరికేసిన సంచలన కేసులో ఉత్తరాఖండ్ హైకోర్టు దోషి బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది. నిందితుడు రాజేశ్ గులాటికి జీవిత ఖైదు, రూ.15 లక్షల ఫైన్ విధిస్తూ డెహ్రాడూన్ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. కాగా రాజేశ్-అనుపమలకు 1999లో వివాహం జరిగింది. మనస్పర్ధలతో 2010 OCT 17న భార్యను చంపి ముక్కలుగా నరికి ఫ్రిజ్‌లో దాచేయగా అదే ఏడాది DEC 12న విషయం బయటికొచ్చింది.