News September 23, 2024

రామయ్యపై ఒట్టేసి మాట తప్పారు: హరీశ్ రావు

image

TG: కాంగ్రెస్ ప్రభుత్వ తీరు వల్ల లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. ‘ఖమ్మం జిల్లా రైతులు ఏం పాపం చేశారు? సీతారామ ప్రాజెక్టు పూర్తయ్యిందని మంత్రులు చెప్పారు. మరి వైరా దిగువన ఉన్న రైతులకు నీళ్లు ఎందుకు ఇవ్వడం లేదు? రుణమాఫీ చేస్తానని భద్రాద్రి రామయ్యపై ఒట్టేసి మాట తప్పారు. వరద బాధితులకు ఇప్పటివరకు పూర్తి పరిహారం ఇవ్వలేదు’ అని ప్రెస్‌మీట్‌లో మండిపడ్డారు.

Similar News

News November 19, 2025

ఈనెల 19న జిల్లాలో రైతుల ఖాతాలో రూ.68.97 కోట్లు

image

అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ పథకం కింద ఈ నెల 19న జిల్లాలోని 1,03,761 మంది రైతుల ఖాతాలలో రెండో విడతగా రూ.68.97 కోట్లు జమ కానున్నట్లు కలెక్టర్ నాగరాణి తెలిపారు. ఒక్కో రైతు ఖాతాలో కేంద్రం వాటా రూ. 2 వేలు, రాష్ట్రం వాటా రూ. 5 వేలు చొప్పున మొత్తం రూ.7 వేలు జమ కానున్నాయి. నిధుల జమ కార్యక్రమానికి జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని కలెక్టర్ పేర్కొన్నారు.

News November 19, 2025

WGL: విద్యుత్ సమస్యలా..? వాట్సాప్ చేయండి!

image

విద్యుత్ సమస్యపై ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియడం లేదా..? చాలా సింపుల్. TG NPDCL వాట్సాప్ నంబరుకు మీ సమస్యను పంపించండి. సమస్య పరిష్కారమయ్యేలా అధికారులు చర్యలు చేపడతారు. ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడానికి విద్యుత్ శాఖ 79016 28348 అనే వాట్సాప్ నంబర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ నంబర్‌కు హాయ్ అని మెసేజ్ చేసి విద్యుత్ సేవలు పొందవచ్చని అధికారులు తెలిపారు.

News November 19, 2025

అఖండ పల్నాడు రారాజు అనుగు రాజు యాదవ్ గురించి తెలుసా..?

image

పల్నాడు చరిత్ర అనగానే బ్రహ్మనాయుడు, నాగమ్మ గుర్తుకొస్తారు. అయితే అఖండ పల్నాడును పరిపాలించిన అనుగురాజు యాదవ్ పాత్ర కీలకమైనది. ఈయనకు ఇద్దరు భార్యలు. పెద్ద భార్య కుమారుడు మలిదేవుడు మాచర్ల రాజధానిగా బ్రహ్మనాయుడు మంత్రిగా, చిన్న భార్య కుమారుడు నలగామ రాజు గురజాల రాజధానిగా నాగమ్మ మంత్రిగా పరిపాలించారు. దాయాదుల మధ్య జరిగిందే పల్నాటి యుద్ధం అనుగరాజ గుర్తుగా పిడుగురాళ్లలో ఆయన విగ్రహం ఏర్పాటు చేశారు.