News March 17, 2025

OUలో పీహెచ్‌డీ ప్రవేశాలకు గడువు పొడిగింపు

image

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని అన్ని ఫ్యాకల్టీల కేటగిరి 2 పీహెచ్‌డీ సీట్ల భర్తీకి నిర్వహించనున్న ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసేందుకు గడువును పొడిగించినట్లు ఓయూ డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ పాండురంగారెడ్డి తెలిపారు. రూ. 2000 అపరాధ రుసుంతో ఈనెల 22 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. ప్రవేశ పరీక్షలు వచ్చేనెల 25 నుంచి నిర్వహించనున్నట్లు చెప్పారు.

Similar News

News November 16, 2025

కరీంనగర్: ‘గృహ నిర్మాణంలో పారదర్శకత పాటించాలి’

image

72వ జాతీయ సహకార వారోత్సవాల సందర్భంగా జిల్లా సహకార అధికారి కార్యాలయంలో గృహ నిర్మాణ సహకార సంఘాల అధ్యక్షులకు అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా సహకార అధికారి రామానుజాచార్య మాట్లాడుతూ.. అర్హుల ఎంపికలో పారదర్శకత పాటించాలని, నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని సూచించారు. సహకార వ్యవస్థ ప్రజలకు అందుబాటులో ఉండేలా సంఘాలు సేవాభావంతో ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు.

News November 16, 2025

GDK: ఆలయాల కూల్చివేతపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు

image

గోదావరిఖనిలో ఇటీవల 46 దారి మైసమ్మ ఆలయాలను కూల్చిన ఘటనపై జిల్లా అడిషనల్ కలెక్టర్ అరుణ శ్రీ, రామగుండం కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్ వెంకటస్వామిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు BJP నేత కొండపర్తి సంజీవ్ శనివారం తెలిపారు. లోక్‌పాల్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ & పబ్లిక్ గ్రీవెన్స్, సెంట్రలైజ్డ్ పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్ & మోనిటరింగ్ సిస్టం, గవర్నర్, CSలకు ఆధారాలతో ఫిర్యాదు చేశామన్నారు.

News November 16, 2025

పాకిస్థాన్ నుంచి డ్రోన్లతో బాంబులు, డ్రగ్స్ సరఫరా

image

పాక్ నుంచి డ్రోన్ల ద్వారా పేలుడు పదార్థాలు, ఆయుధాలు, డ్రగ్స్‌ సరఫరా చైన్‌ను NIA రట్టు చేసింది. ప్రధాన వ్యక్తి విశాల్ ప్రచార్‌ అరెస్టు చేసి తాజాగా ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. పాక్ బార్డర్లలో డ్రోన్ల ద్వారా వచ్చే ఆర్మ్స్, డ్రగ్స్, అమ్మోనియం వంటి వాటిని గ్యాంగుల ద్వారా పంజాబ్, హరియాణా, రాజస్థాన్‌కు చేరవేస్తున్నారని పేర్కొంది. సామాజిక అస్థిరత సృష్టించేలా ఈ గ్యాంగులు పనిచేస్తున్నాయని NIA వివరించింది.