News March 17, 2025

OUలో పీహెచ్‌డీ ప్రవేశాలకు గడువు పొడిగింపు

image

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని అన్ని ఫ్యాకల్టీల కేటగిరి 2 పీహెచ్‌డీ సీట్ల భర్తీకి నిర్వహించనున్న ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసేందుకు గడువును పొడిగించినట్లు ఓయూ డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ పాండురంగారెడ్డి తెలిపారు. రూ. 2000 అపరాధ రుసుంతో ఈనెల 22 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. ప్రవేశ పరీక్షలు వచ్చేనెల 25 నుంచి నిర్వహించనున్నట్లు చెప్పారు.

Similar News

News March 17, 2025

పెద్దపల్లి: నిరుద్యోగ బీసీ అభ్యర్థులకు ఉచిత ఉపాధి శిక్షణ

image

ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులైన PDPL జిల్లా బీసీ అభ్యర్థులకు హైదరాబాద్‌లో ఉచిత శిక్షణ అందిస్తున్నట్లు PDPL జిల్లా BC అభివృద్ధి అధికారి రంగారెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఆసక్తిగల, అర్హులైన నిరుద్యోగ అభ్యర్థులు ఏప్రిల్ 8లోపు www.tgbcstudycircle.cgg.gov.inలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు 8782268686కు కాల్ చేసి సంప్రదించాలని సూచించారు. కుల, ఆదాయ పత్రాలతో అప్లై చేసుకోవాలన్నారు. SHARE IT.

News March 17, 2025

శ్రీవారి దర్శనానికి ఎంత సమయమంటే?

image

AP: తిరుమలలో భక్తుల రద్దీ కాస్త తగ్గింది. శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. 9 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న వెంకన్నను 82,721 మంది భక్తులు దర్శించుకున్నారు. అదే సమయంలో హుండీ ఆదాయం రూ.4.46 కోట్లు సమకూరింది.

News March 17, 2025

కరీంనగర్ జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు

image

కరీంనగర్ జిల్లా గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. గడచిన 24 గంటల్లో అత్యధికంగా బురుగుపల్లి 41.6°C నమోదు కాగా, కొత్తపల్లి-ధర్మారం 40.9, వీణవంక 39.6, జమ్మికుంట, తాంగుల 39.3, చింతకుంట 39.0, ఇందుర్తి, ఈదులగట్టేపల్లి 38.8, ఆసిఫ్ నగర్ 38.7, నుస్తులాపూర్ 38.5, ఖాసీంపేట 38.4, మల్యాల 38.1, గంగాధర 38.0, బోర్నపల్లి, రేణికుంట 37.9, పోచంపల్లి 37.8, వెదురుగట్టు, కరీంనగర్ 37.7, గుండి 37.6°Cగా నమోదైంది.

error: Content is protected !!