News February 28, 2025

OU డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అసైన్మెంట్ గడువు పెంపు

image

OU ప్రొఫెసర్ రామ్ రెడ్డి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సెంటర్‌లో UG, PG విద్యార్థుల అసైన్మెంట్ గడువు మార్చి 29 వరకు పొడిగించారు. విద్యార్థులు పరీక్షా ఫీజు చెల్లించి, రసీదు జతచేసి (చేతిరాతతో రాసినవి మాత్రమే) అసైన్మెంట్‌ను సమర్పించాలి. జిరాక్స్ కాపీలు, ఫొటోకాపీలు, టైప్ చేసినవి చెల్లవు. గడువు దాటితే స్వీకరించరని అధికారులు స్పష్టం చేశారు. మొదటి గడువు తేదీ మార్చి 5గా ప్రకటించారు. తాజాగా దానిని పొడిగించారు.

Similar News

News December 9, 2025

బాపట్ల: 32 కంపెనీలు.. 10 పాసైతే ఉద్యోగం

image

పొన్నూరులోని వెలగా నాగేశ్వరరావు ఇంజినీరింగ్ కాలేజీలో AP స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఈనెల 12న మెగా జాబ్ మేళా నిర్వహించనుంది. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు మేళాలో పాల్గొనవచ్చని నిర్వాహకులు తెలిపారు. మేళాలో 32 కంపెనీలు పాల్గొంటాయన్నారు. SSC నుంచి PG వరకు చదివిన యువత బయోడేటా, సర్టిఫికెట్లతో హాజరు కావాలన్నారు. ఆసక్తి కలిగిన వారు రిజిస్ట్రేషన్ లింక్ https://naipunyam.ap.gov.in/user-registration.

News December 9, 2025

గజగజ.. రేపు కూడా చలి తీవ్రత

image

తెలంగాణలో చలి వణికిస్తోంది. హైదరాబాద్‌ సహా జిల్లాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రేపు కూడా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, హైదరాబాద్‌లో టెంపరేచర్ 6-8 డిగ్రీలకు పడిపోనున్నట్లు వాతావరణ నిపుణులు తెలిపారు. ఉదయం, రాత్రి వేళల్లో ప్రయాణాలు మానుకోవాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులను బయటికి తీసుకెళ్లవద్దని సూచిస్తున్నారు.

News December 9, 2025

‘తెలంగాణ విజన్ -2047’ డాక్యుమెంట్.. కీలక అంశాలు

image

⋆ 2047 నాటికి $3T ఆర్థిక వ్యవస్థే ప్రధాన లక్ష్యం
⋆ 10 కీలక వ్యూహాలతో డాక్యుమెంట్, సమతుల్య అభివృద్ధి కోసం రాష్ట్రాన్ని 3 జోన్లుగా విభజన (CURE, PURE, RARE)
⋆ పెట్టుబడుల ఆకర్షణ, పాలనలో పారదర్శకత, ఫ్యూచర్ సిటీ, మూసీ పునరుజ్జీవనం వంటి ప్రాజెక్టులు. కళలు, పర్యాటకాన్ని పరిరక్షించడం, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా విధానాల రూపకల్పన వంటివి ఇందులో ఉన్నాయి. పూర్తి డాక్యుమెంట్ కోసం ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.