News February 28, 2025

OU డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అసైన్మెంట్ గడువు పెంపు

image

OU ప్రొఫెసర్ రామ్ రెడ్డి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సెంటర్‌లో UG, PG విద్యార్థుల అసైన్మెంట్ గడువు మార్చి 29 వరకు పొడిగించారు. విద్యార్థులు పరీక్షా ఫీజు చెల్లించి, రసీదు జతచేసి (చేతిరాతతో రాసినవి మాత్రమే) అసైన్మెంట్‌ను సమర్పించాలి. జిరాక్స్ కాపీలు, ఫొటోకాపీలు, టైప్ చేసినవి చెల్లవు. గడువు దాటితే స్వీకరించరని అధికారులు స్పష్టం చేశారు. మొదటి గడువు తేదీ మార్చి 5గా ప్రకటించారు. తాజాగా దానిని పొడిగించారు.

Similar News

News December 7, 2025

టాటా, మారుతి కార్లపై భారీ డిస్కౌంట్లు

image

టాటా, మారుతి సుజుకీ DECలో కార్లపై భారీ డిస్కౌంట్లు ఇస్తున్నాయి. మారుతి Invictoపై ₹2.15 లక్షల వరకు తగ్గింపు ప్రకటించింది. ₹లక్ష క్యాష్ డిస్కౌంట్, ₹1.15 లక్షల వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ ఇవ్వనుంది. Fronxపై ₹88వేల వరకు డిస్కౌంట్ లభిస్తుంది. హారియర్, సఫారీ SUVలపై ₹75 వేల వరకు క్యాష్ డిస్కౌంట్‌ను టాటా అందిస్తోంది. పాత మోడల్‌ తీసుకుంటే ₹లక్ష దాకా రాయితీ ఇవ్వనుంది. ఇతర మోడల్స్‌కూ ₹25K-55K డిస్కౌంట్స్ ఇస్తోంది.

News December 7, 2025

VKB: నామినేషన్ల ఉపసంహరణ .. బుజ్జగింపుల పర్వం

image

వికారాబాద్ జిల్లాలో గ్రామ పంచాయతీ సర్పంచ్‌, వార్డు మెంబర్ల నామినేషన్ల ఘట్టం ముగియడంతో ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. తీవ్ర పోటీ ఉన్న స్థానాల్లో, పోలింగ్‌కు ముందే తమ అభ్యర్థులను ఉపసంహరించుకోవాలని ప్రధాన పార్టీల నాయకుల బుజ్జగింపులు మొదలయ్యాయి. మూడో విడత ఉపసంహరణ గడువు ఈ నెల 9న ఉండటంతో పోటీలో ఉన్న అభ్యర్థులు ప్రత్యర్థులను విత్ డ్రా చేయించేలా ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

News December 7, 2025

కాకాణి గోవర్ధన్ రెడ్డిపై మరో కేసు నమోదు

image

మాజీమంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై వెంకటాచలం పోలీస్ స్టేషన్లో మరో కేసు నమోదయింది. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు.. ఆధారాలు లేకుండా అవినీతి ఆరోపణలు చేశారంటూ టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాధాకృష్ణ నాయుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. గతంలో ఈ పోలీస్ స్టేషన్లో పలు కేసులు కాకాణిపై ఉన్నాయి.