News December 29, 2024
OU: MBA కోర్సుల పరీక్ష ఫీజు స్వీకరణ

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఎంబీఏ కోర్సుల పరీక్షా ఫీజును స్వీకరించనున్నట్లు అధికారులు తెలిపారు. ఎంబీఏ (సీబీసీఎస్), ఎంబీఏ (టెక్నాలజీ మేనేజ్మెంట్- డే), ఎంబీఏ (టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్) కోర్సుల మూడో సెమిస్టర్ రెగ్యులర్, ఎంబీఏ (ఈవినింగ్) అయిదో సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షా ఫీజును వచ్చే నెల 4వ తేదీలోగా, రూ.300 లేట్ ఫీతో 6వ తేదీలోగా సంబంధిత కళాశాలల్లో చెల్లించాలని చెప్పారు.
Similar News
News November 5, 2025
BE READY.. నగరంలో బిగ్గెస్ట్ పెట్ షో

ఈనెల 22,23 తేదీల్లో సిటీలో అతి పెద్ద పెట్ షో జరుగనుంది. నార్సింగిలోని ఓమ్ కన్వెన్షన్ ఇందుకు వేదిక కానుంది. దాపు 500 విభిన్న జాతులకు చెందిన కుక్కలు ప్రదర్శనకు రానున్నాయి. అంతేకాక వందకుపైగా పిల్లుల జాతులు, అరుదైన చేపలు అలరించనున్నాయి. ఇంకో విషయమేమంటే.. ఈ ఎగ్జిబిషన్లో పెట్స్ యాక్సెసరీస్ కూడా అందుబాటులో ఉంటాయని నిర్వాహకులు తెలిపారు.
News November 5, 2025
HYD: పులులను లెక్కించాలని ఉందా.. మీ కోసమే!

దేశంలో పులుల సంఖ్య ఎంతో తెలుసుకోవాలనుందా? అవి ఎన్ని ఉన్నాయో తెలుసుకోవాలని ఉందా? అయితే ఇది మీ కోసమే. వచ్చే ఏడాది జనవరిలో(17- 23 వరకు) ప్రభుత్వం పులుల గణన చేపట్టనుంది. ఆసక్తి ఉన్న వారు తమ పేర్లు నమోదు చేసుకోవచ్చు. అయితే రోజుకు 10- 15 కిలోమీటర్లు నడవాల్సి ఉంటుంది. అంతేకాక మీ వయసు 18- 60 ఏళ్లలోపు ఉండాలి. ఈ నెల 22లోపు అప్లై చేసుకోవాలి. వివరాలకు 040-23231440 నంబరుకు ఫోన్ చేయండి.
News November 5, 2025
బల్కంపేట ఎల్లమ్మ గుడిలో నేడు దీపోత్సవం

కార్తీక పౌర్ణమి వేడుకలు బల్కంపేట ఎల్లమ్మ గుడిలో బుధవారం ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సా.6 గంటలకు ప్రత్యేక పూజలు ప్రారంభమవుతాయి. భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉండటంతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలూ తీసుకున్నామని టెంపుల్ ఈవో శేఖర్ పేర్కొన్నారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించనన్నారు.


