News October 16, 2024
టెర్రరిజాన్ని బట్టే సరిహద్దుల్లో మా యాక్టివిటీస్: జైశంకర్

ఉగ్రవాదం, అతివాదమే సరిహద్దుల్లో యాక్టివిటీస్ను నిర్దేశిస్తాయని EAM జైశంకర్ అన్నారు. వాటితో వాణిజ్యం, ఇంధన సరఫరా, కనెక్టివిటీ జరగదని స్పష్టం చేశారు. ఇక UNSCలో విస్తృత ప్రాతినిధ్యం, సమ్మిళితత్వం, పారదర్శకత కోసం SCO చొరవ తీసుకోవాలని సూచించారు. సంస్కరణల వేగవంతానికి కృషి చేయాలన్నారు. ఇండస్ట్రియల్ కోఆపరేషన్ వల్లే పోటీతత్వం, లేబర్ మార్కెట్లు విస్తరిస్తాయన్నారు. MSME కొలాబరేషన్, కనెక్టివిటీ అవసరమన్నారు.
Similar News
News December 21, 2025
ఆచార్య NG రంగా అగ్రికల్చరల్ వర్సిటీలో టీచింగ్ పోస్టులు

AP: ఆచార్య NG రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ 7 టీచింగ్ అసోసియేట్ పోస్టులను భర్తీ చేయనుంది. పోస్టును బట్టి BSc, MSc(హోమ్ సైన్స్, కమ్యూనిటీ సైన్స్, హ్యూమన్ డెవలప్మెంట్ & ఫ్యామిలీ స్టడీస్), PhD ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 40ఏళ్లు(M), మహిళలకు 45ఏళ్లు. అర్హతగల వారు ఈనెల 29, 30 తేదీల్లో ఇంటర్వ్యూకు హాజరు కావచ్చు. వెబ్సైట్: https://angrau.ac.in
News December 21, 2025
‘కెరీర్ మినిమలిజం’.. Gen Zలో కొత్త ట్రెండ్.. ఏంటిది?

ఆఫీసుల్లో రాత్రి పగలు కష్టపడే హజిల్ కల్చర్కు Gen Z చెక్ పెడుతోంది. దీన్నే కెరీర్ మినిమలిజం అంటున్నారు. అంటే పని పట్ల బాధ్యత లేకపోవడం కాదు. ప్రమోషన్లు, హోదాల వెంట పడకుండా ప్రశాంతతకు ప్రాధాన్యం ఇవ్వడం. మేనేజర్ పోస్టుల్లో ఉండే స్ట్రెస్ కంటే మెంటల్ హెల్త్, పర్సనల్ లైఫ్ ముఖ్యమని వీరు భావిస్తున్నారు. 72% మంది టీమ్ మేనేజ్మెంట్ కంటే స్కిల్స్ పెంచుకోవడానికే ఇష్టపడుతున్నారు.
News December 21, 2025
ఏం సౌకర్యాలు కల్పించారని ఛార్జీల పెంపు?

₹600Cr అదనపు ఆదాయమే లక్ష్యంగా <<18630596>>రైల్వే ఛార్జీలను <<>>పెంచింది. అయితే కొత్తగా ఏం సౌకర్యాలు కల్పించారని ఈ రేట్ల పెంపు అనే ప్రశ్నలు వస్తున్నాయి. పండుగలొస్తే నిలబడి ప్రయాణించే పరిస్థితి మారలేదు. ముక్కుబిగబట్టి టాయిలెట్కు వెళ్లే దుర్భర స్థితిలోనూ మార్పులేదు. సరైన సమయానికి రైలు స్టేషన్కు వచ్చిన రికార్డూ లేదు. కరోనాలో ఆగిపోయిన వృద్ధులు, వికలాంగులకు ఇచ్చే రాయితీని పునరుద్ధరించలేదు. మరి ఎందుకు ఛార్జీల పెంపు?


