News August 8, 2024
వారి తప్పులను సరిదిద్దేందుకే మా ప్రయత్నం: సీతక్క

TG: గ్రామ పంచాయతీలను బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో రకాలుగా భ్రష్టు పట్టించిందని మంత్రి సీతక్క మండిపడ్డారు. గ్రామపంచాయతీలకు రూ.10,170 కోట్లు కేటాయించి రూ.5,988 కోట్లనే రిలీజ్ చేసిందని మీడియాతో చెప్పారు. మిగిలినవి పెండింగ్లో పెట్టిందన్నారు. BRS ప్రభుత్వ తప్పులను సరిదిద్దేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తెలిపారు. ‘స్వచ్ఛదనం-పచ్చదనం’ కార్యక్రమంపై హరీశ్ రావు విమర్శలు మానుకోవాలని హితవు పలికారు.
Similar News
News December 30, 2025
స్వల్ప నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు స్వల్ప నష్టాల్లో పయనిస్తున్నాయి. సెన్సెక్స్ 46 పాయింట్ల నష్టంతో 84,649 వద్ద, నిఫ్టీ 10 పాయింట్లు నష్టపోయి 25,932 వద్ద ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్ 30 సూచీలో ఎంఅండ్ఎం, ఎయిర్టెల్, అదానీ పోర్ట్స్, ట్రెంట్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు లాభాల్లో.. ఎటర్నల్, ఇండిగో, బజాజ్ ఫిన్సర్వ్, ఇన్ఫీ, టాటా స్టీల్, HCL టెక్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
News December 30, 2025
ఓవర్ స్పీడ్ ఫైన్ రూ.73,500.. యాక్సిడెంట్ల నియంత్రణకు ఇదే మార్గమా?

యూఏఈలోని దుబాయ్లో ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసిన వాహనదారులకు భారీగా జరిమానాలు విధిస్తారు. ఓవర్ స్పీడ్ రూ.73,500, సిగ్నల్ జంప్ రూ.24,500, ఫోన్ వాడితే రూ.19,500, సీట్ బెల్ట్ లేకుంటే రూ.9,800 ఫైన్ వేస్తారు. మన దేశంలోనూ రోడ్డు ప్రమాదాలు తగ్గాలంటే ఇలాంటి జరిమానాలు విధించాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే ఫైన్స్ కంటే ముందు దుబాయ్లా రోడ్లు వేయాలని మరికొందరు సూచిస్తున్నారు. మీ COMMENT?
News December 30, 2025
ఐఐసీటీ హైదరాబాద్లో ఉద్యోగాలు.. అప్లైకి ఇవాళే ఆఖరు తేదీ

HYDలోని CSIR-ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ(<


