News August 8, 2024
వారి తప్పులను సరిదిద్దేందుకే మా ప్రయత్నం: సీతక్క

TG: గ్రామ పంచాయతీలను బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో రకాలుగా భ్రష్టు పట్టించిందని మంత్రి సీతక్క మండిపడ్డారు. గ్రామపంచాయతీలకు రూ.10,170 కోట్లు కేటాయించి రూ.5,988 కోట్లనే రిలీజ్ చేసిందని మీడియాతో చెప్పారు. మిగిలినవి పెండింగ్లో పెట్టిందన్నారు. BRS ప్రభుత్వ తప్పులను సరిదిద్దేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తెలిపారు. ‘స్వచ్ఛదనం-పచ్చదనం’ కార్యక్రమంపై హరీశ్ రావు విమర్శలు మానుకోవాలని హితవు పలికారు.
Similar News
News October 18, 2025
ఏపీ న్యూస్ రౌండప్

* ఈ నెల 19-24 వరకు మంత్రి లోకేశ్ ఆస్ట్రేలియా పర్యటన.. వర్సిటీల్లో అధునాతన బోధనా పద్ధతులపై అధ్యయనం
* తిరుమలలో TG భక్తులను మోసం చేసిన దళారీ అశోక్.. శ్రీవారి సేవా టికెట్లు ఇప్పిస్తానని రూ.4లక్షలు కాజేసి పరారీ
* పౌరసరఫరాల శాఖపై విమర్శలు చేసిన నెల్లూరు(D)కు చెందిన కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డిపై TDP అధిష్ఠానం సీరియస్.. ఇవాళ పార్టీ కేంద్ర కార్యాలయానికి రావాలని పిలుపు
News October 18, 2025
‘డ్యూడ్’, ‘తెలుసు కదా’ చిత్రాల కలెక్షన్స్ ఇలా!

* ప్రదీప్ రంగనాథన్ నటించిన ‘డ్యూడ్’ మూవీకి తొలిరోజు మంచి కలెక్షన్లు వచ్చాయి. ఈ చిత్రానికి రూ.10 కోట్లకుపైగా నెట్ కలెక్షన్స్ వచ్చాయని ట్రేడ్ వర్గాలు తెలిపాయి.
* సిద్ధూ జొన్నలగడ్డ నటించిన ‘తెలుసు కదా’ సినిమాకు ఫస్ట్ డే షాకింగ్ కలెక్షన్లు వచ్చినట్లు తెలుస్తోంది. తొలిరోజు ఇండియాలో రూ.2 కోట్లకు పైగా నెట్ కలెక్షన్లు వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
* వీటిలో ఏ మూవీ నచ్చిందో కామెంట్ చేయండి.
News October 18, 2025
వంటింటి చిట్కాలు

* కిస్మిస్లు నిల్వ చేసే ముందు రెండు స్పూన్ల బియ్యప్పిండిని వాటికి పట్టిస్తే ఎన్ని రోజులైనా అతుక్కోకుండా ఉంటాయి.
* నూనె డబ్బాలు ఎంత తోమినా జిడ్డుగానే ఉంటాయి. అప్పుడు కాస్త క్రిస్టల్ సాల్ట్, డిష్ వాష్ లిక్విడ్ వేసిన నీటిలో డబ్బాను కాసేపు నానబెట్టి స్క్రబ్బర్తో రుద్దాలి. దీంతో జిడ్డంతాపోయి తళతళా మెరుస్తాయి.
* చేపలు శుభ్రం చేసిన తర్వాత శెనగపిండి పట్టించి 5 నిమిషాల తర్వాత కడిగితే నీచు వాసన పోతుంది.