News March 20, 2025
మన ‘సంతోషం’ తక్కువేనట..

ప్రపంచ సంతోష సూచీలో వరుసగా 8వ సారి ఫిన్లాండ్ తొలి స్థానంలో నిలిచింది. 147 దేశాలతో కూడిన ఈ జాబితాలో భారత్ 118వ స్థానంలో నిలిచింది. పొరుగు దేశాలు నేపాల్(92), PAK(109) భారత్ కంటే ముందు స్థానాల్లో ఉన్నాయి. అయితే గత ఏడాది(126)తో పోలిస్తే ఇండియా తన పొజిషన్ను కాస్త మెరుగుపరుచుకుంది. కాగా సామాజిక మద్దతు, ఆయుర్దాయం, స్వేచ్ఛ, దాతృత్వం, అవినీతి వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని ఈ ర్యాంకులు ఇస్తారు.
Similar News
News January 8, 2026
యూరియా తీసుకున్న రైతులపై నిఘా

TG: ఒకేసారి 40-50 బస్తాల యూరియా కొనుగోలు చేసిన రైతులపై వ్యవసాయ శాఖ ప్రత్యేక నిఘా పెట్టింది. 4 జిల్లాల్లో అనుమానాస్పద లావాదేవీలు వెలుగులోకి రావడంతో క్షేత్రస్థాయి విచారణకు రాష్ట్ర వ్యవసాయ శాఖ డైరెక్టర్ బి. గోపి ఆదేశాలు జారీ చేశారు. నిర్మల్, నల్లగొండ, భద్రాద్రి కొత్తగూడెం, కామారెడ్డి జిల్లాలకు ప్రత్యేక బృందాలు వెళ్లాయి. రైతుల భూమి విస్తీర్ణం, పంటలు, యూరియా అవసరం, వినియోగాన్ని పరిశీలించనున్నాయి.
News January 8, 2026
మిరపలో వేరుపురుగు నివారణకు సూచనలు

మిరపలో వేరు పురుగు నివారణకు ముందుగా వేసవిలో లోతు దుక్కులు చేసుకోవాలి. క్లోరోఫైరిఫాస్ 8 మి.లీ ఒక కిలో విత్తనానికి పట్టించి నీడలో ఆరబెట్టి విత్తుకోవాలి. జీవ సంబంధిత మెటారైజియం ఎనాయిసోప్లి వేర్ల దగ్గర పోయాలి. కార్బోఫ్యూరాన్ 3జి గుళికలను ఎకరాకు 5-10 కిలోలు పొడి ఇసుకతో కలిపి నేలలో తేలికపాటి తడి ఉన్నప్పుడు సాళ్ల వెంట వేసుకోవాలి. అలాగే ఎకరాకు 10కిలోల వేపపిండి వేసుకోవాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.
News January 8, 2026
ఇండ్బ్యాంక్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్

<


