News November 28, 2024
మా తదుపరి లక్ష్యం అదే: అజిత్ పవార్

గతంలో జాతీయ హోదా కలిగిన NCPని తిరిగి ఆ స్థాయికి తీసుకురావడమే తమ లక్ష్యమని పార్టీ చీఫ్ అజిత్ పవార్ పేర్కొన్నారు. కొత్త తరాన్ని ముందుకు తీసుకువస్తామని, అందులోనూ మహిళలకు అధిక ప్రాధాన్యం ఇస్తామన్నారు. Decలో పార్టీ జాతీయ సదస్సు నిర్వహించనున్నట్టు తెలిపారు. 3 స్టేట్స్లో రాష్ట్ర పార్టీగా ఉన్నామని, రానున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్టు NCP MP ప్రఫుల్ పటేల్ తెలిపారు.
Similar News
News November 17, 2025
ఎల్లుండి పుట్టపర్తికి ప్రధాని మోదీ

AP: శ్రీసత్యసాయి శత జయంతి వేడుకల్లో భాగంగా రేపు జరిగే రథోత్సవంతో అధికారిక కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. ఎల్లుండి పుట్టపర్తిలోని హిల్వ్యూ స్టేడియంలో మహిళా దినోత్సవానికి ముఖ్య అతిథిగా ప్రధాని మోదీ హాజరుకానున్నారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, గవర్నర్లు, సీఎంలు వేడుకల్లో పాల్గొంటారు. 20, 21 తేదీల్లో యువజన సదస్సులు, 22న సత్యసాయి వర్సిటీ స్నాతకోత్సవం, 23న అధికారిక శతజయంతి వేడుకలను నిర్వహిస్తారు.
News November 17, 2025
తేజస్ను నడిపిన తొలి మహిళా ఫైటర్ పైలెట్

దేశీయ యుద్ధ విమానం తేజస్ ఫైటర్ జెట్ స్క్వాడ్రన్ నిర్వహించే ఎలైట్ 18 ఫ్లయింగ్ బులెట్స్ స్క్వాడ్రన్లో తొలి మహిళా ఫైటర్ పైలట్గా రికార్డులకెక్కారు. భారతవైమానికదళంలోని ముగ్గురు మహిళా పైలట్లలో స్క్వాడ్రన్ లీడర్ మోహనాసింగ్ ఒకరు. జెట్ ఫైటర్గా రాణించాలంటే యుద్ధ సమయంలో పాటించాల్సిన వ్యూహాలతో పాటు, యుక్తులు ప్రదర్శించగలగాలి. ఈ శిక్షణలో నెగ్గితేనే యుద్ధ విమానాన్ని నడిపేందుకు అర్హత సాధిస్తారు.
News November 17, 2025
ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశం.. నేడు ఏం జరగనుంది?

TG: ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారంపై సుప్రీంకోర్టులో ఈరోజు విచారణ జరగనుంది. స్పీకర్పై దాఖలైన కోర్టు ధిక్కార పిటిషన్తో పాటు 10 మంది MLAలపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్ను ధర్మాసనం నేడు విచారించనుంది. MLAలను విచారించేందుకు స్పీకర్కు మరింత సమయం ఇస్తారా? లేదా తుది నిర్ణయం తీసుకుంటారా? ఈ నెల 23న సీజేఐ గవాయ్ రిటైర్ కానున్న నేపథ్యంలో విచారణను మరో బెంచ్కు పంపిస్తారా? అన్న దానిపై ఆసక్తి నెలకొంది.


