News June 4, 2024
తెలంగాణలో మన నంబర్ డబుల్ అయింది: మోదీ

వివిధ రాష్ట్రాల్లో BJP సాధించిన విజయాలపై మోదీ సంతృప్తి వ్యక్తం చేశారు. ‘తెలంగాణలో మన నంబర్ డబుల్ అయింది. మధ్యప్రదేశ్, గుజరాత్, ఛత్తీస్గఢ్, ఢిల్లీ, ఉత్తరాఖండ్, హిమాచల్ తదితర రాష్ట్రాల్లో దాదాపు క్లీన్స్వీప్ చేశాం. బీజేపీని ఆదరించిన ఏపీ, ఒడిశా ప్రజలకు నా ప్రత్యేక ధన్యవాదాలు. ఏపీలో చంద్రబాబు అద్భుత ఫలితాలు సాధించారు. అరుణాచల్, ఏపీ, ఒడిశా, సిక్కిం అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచాం’ అని మోదీ వివరించారు.
Similar News
News November 23, 2025
బోస్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు

<
News November 23, 2025
శ్రీవారి ఆలయంలో పంచబేర వైభవం

తిరుమల శ్రీవారి ఆలయ గర్భగుడిలో 5 ప్రధానమైన మూర్తులు కొలువై ఉన్నాయి. ప్రధానమైనది, స్వయంవ్యక్త మూర్తి అయినది ధ్రువబేరం. నిత్యం భోగాలను పొందే మూర్తి భోగ శ్రీనివాసుడు ‘కౌతుకబేరం’. ఉగ్ర రూపంలో ఉండే స్వామి ఉగ్ర శ్రీనివాసుడు ‘స్నపన బేరం’. రోజువారీ కొలువు కార్యక్రమాలలో పాల్గొనే మూర్తి కొలువు శ్రీనివాసుడు ‘బలిబేరం’. ఉత్సవాల కోసం ఊరేగింపుగా వెళ్లే మూర్తి మలయప్పస్వామి ‘ఉత్సవబేరం’. <<-se>>#VINAROBHAGYAMU<<>>
News November 23, 2025
రేపు వాయుగుండం.. 48 గంటల్లో తుఫాన్

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మలక్కా, సౌత్ అండమాన్ మీదుగా కొనసాగుతోందని APSDMA తెలిపింది. ఇది వాయవ్యదిశగా కదులుతూ రేపటికల్లా వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. అదేవిధంగా కొనసాగుతూ 48 గంటల్లో తుఫాన్గా బలపడే ఛాన్స్ ఉందని హెచ్చరించింది. దీని ప్రభావంతో ఈ నెల 28 నుంచి డిసెంబర్ 1 వరకు ఏపీలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే పేర్కొన్న సంగతి తెలిసిందే.


