News September 25, 2024
ఉక్రెయిన్కు మా మద్దతు కొనసాగుతుంది: బైడెన్
ఉక్రెయిన్లో శాంతి నెలకొనే వరకూ ఆ దేశానికి తమ మద్దతు కొనసాగుతుందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు. నాటో మిత్ర దేశాలు కలిసికట్టుగా ఉండటంతో ఉక్రెయిన్పై రష్యా యుద్ధం విఫలమైందని పేర్కొన్నారు. ఫిన్లాండ్, స్వీడన్ దేశాలు కొత్తగా నాటోలో చేరడంతో మరింత బలం చేకూరిందని చెప్పారు. పశ్చిమాసియా సంక్షోభంతోపాటు సూడాన్లో 17 నెలలుగా కొనసాగుతున్న అంతర్యుద్ధానికి ముగింపు పలకాల్సిన అవసరం ఉందన్నారు.
Similar News
News September 25, 2024
హైదరాబాద్-అయోధ్య విమాన సర్వీసులు
శంషాబాద్ నుంచి రాముడి జన్మస్థానమైన అయోధ్యకు ఈ నెల 27 నుంచి ఇండిగో విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. వారంలో నాలుగు రోజులు ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయి. అలాగే ఈ నెల 28 నుంచి ప్రయాగ్ రాజ్, ఆగ్రాకు కూడా రెండు సర్వీసులను ఇండిగో ప్రారంభించనుంది. వారంలో 3 రోజులు ఈ విమానాలు తిరుగుతాయి. అటు ప్రతి సోమ, మంగళవారాల్లో అగర్తల, జమ్మూలకు విమాన సర్వీసులు ఉంటాయని ఇండిగో ప్రకటించింది.
News September 25, 2024
కొత్త కోర్సు.. నేడు ప్రారంభించనున్న సీఎం
TG: BFSI(బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్) మినీ డిగ్రీ కోర్సును CM రేవంత్ ఇవాళ ప్రారంభించనున్నారు. అత్యధిక జాబ్ డిమాండ్ ఉన్న ఈ కోర్సును డిగ్రీ, ఇంజినీరింగ్లో చేరిన విద్యార్థులకు అందిస్తారు. పట్టా పొందినవారి వివరాలతో హయ్యర్ ఎడ్యుకేషన్ ప్రత్యేక పోర్టల్ రూపొందించనుంది. BFSI రంగంలో పేరొందిన కంపెనీలు తమకు అవసరమైన వారిని జాబ్స్కు ఎంపిక చేసుకునేందుకు ఈ పోర్టల్ వారధిగా పనిచేయనుంది.
News September 25, 2024
భారీ వర్షాలు.. తీవ్ర విషాదం
TG: భారీ వర్షాలు రాష్ట్రంలో తీవ్ర విషాదం నింపాయి. పిడుగుపాటుకు వివిధ ప్రాంతాల్లో ఐదుగురు మృతి చెందారు. భద్రాద్రి(D) దమ్మపేట(మ) జగ్గారంలో వర్షం పడుతోందని ఓ చెట్టు కిందకు వెళ్లడంతో సమీపంలో పిడుగుపడి నాగశ్రీ(22), అనూష(23) చనిపోయారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండంతో ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. మహబూబ్నగర్, కరీంనగర్, NZB జిల్లాల్లో ఇద్దరు వృద్ధులు, మరో వ్యక్తి(29) తుదిశ్వాస విడిచారు.