News September 21, 2025
వరిలో సుడిదోమ విజృంభణ.. లక్షణాలు

* అధికంగా నత్రజని ఎరువులను వాడటం, పొలంలో ఎక్కువగా నీరు నిల్వచేయడం వల్ల సుడి దోమ విజృంభిస్తుంది.
* నేరుగా విత్తే పద్ధతిలో ఎక్కువ విత్తనాలను చల్లడం, పైరు తొలి దశలో పురుగు మందులను ఎక్కువగా వాడటంతో మిత్ర కీటకాల సంఖ్య తగ్గి దోమ తీవ్రత పెరుగుతుంది.
* దోమలు వరి మొదళ్ల వద్ద చేరి రసాన్ని పీల్చేస్తాయి. దీనివల్ల మొక్కలు పసుపు రంగులోకి మారి ఎండిపోతాయి. చివరగా తాలు గింజలు ఏర్పడి దిగుబడి తగ్గుతుంది.
<<-se>>#PADDY<<>>
Similar News
News September 21, 2025
ట్రంప్ను ఓటర్లు గెలిపించింది ఇందుకే: వైట్హౌజ్

ట్రంప్ H-1B వీసా ఫీజును <<17767574>>భారీగా<<>> పెంచడాన్ని వైట్హౌజ్ సమర్థిస్తూ ఫ్యాక్ట్షీట్ రిలీజ్ చేసింది. ‘2003లో 32% ఉన్న వీసాలు ఇటీవల 65%కు పెరిగాయి. నిరుద్యోగుల సంఖ్య రెట్టింపైంది. ఈ ఏడాది ఓ కంపెనీ 5,189 వీసాలను ఆమోదించి 16వేల మంది US ఉద్యోగులను తొలగించింది. మరో కంపెనీ 2022 నుంచి 25,075 వీసాలను పొంది 27వేల మంది స్థానికులను తీసేసింది. ఓటర్లు ట్రంప్ను గెలిపించింది వారికి న్యాయం చేయడానికే’ అని వివరించింది.
News September 21, 2025
ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంపునకు ప్రభుత్వం వ్యతిరేకం: ఉత్తమ్

TG: కర్ణాటకలోని కృష్ణా నదిపై ఉన్న ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకమని మంత్రి ఉత్తమ్ కుమార్ తెలిపారు. ‘ఈ డ్యాంపై సుప్రీంకోర్టులో కేసు నడుస్తోంది. నేను రేపు ఢిల్లీకి వెళ్తా. ఆల్మట్టి ఎత్తు పెంపుపై వ్యతిరేకంగా వాదనలు వినిపిస్తాం. కాళేశ్వరం ప్రాజెక్టుతో రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగింది. దానిపై విచారణ జరుగుతోంది. ఎంతటివారైనా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం’ అని వివరించారు.
News September 21, 2025
‘తిరుమలలో తొక్కిసలాట’ ప్రచారం నమ్మవద్దు: TTD

AP: తిరుమలలో తొక్కిసలాట అని, తిరుపతిలోని కపిలతీర్థంలో ఏర్పాట్లు చేయలేదని SMలో జరుగుతున్న ప్రచారాన్ని TTD ఖండించింది. ‘మహాలయ అమావాస్య వేళ కపిలతీర్థం ఆలయం బయట పితృతర్పణాలు జరపడం ఆనవాయితీ. అందుకోసం అన్ని ఏర్పాట్లు చేశాం. ఎస్పీ, పోలీస్ వాహనాలు రావడం చూసి తొక్కిసలాట అని ప్రచారం చేస్తున్నారు. TTDపై దుష్ప్రచారం చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటాం’ అని హెచ్చరించింది.