News August 30, 2024
బంగ్లా అల్లర్లలో 1000 దాటిన మరణాలు

ఇటీవల బంగ్లాదేశ్లో చోటుచేసుకున్న అల్లర్లలో మరణాల సంఖ్య 1000 దాటినట్లు ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వం వెల్లడించింది. మరోవైపు గాయపడిన వారికి ఉచిత చికిత్స అందిస్తున్నట్లు తెలిపింది. మరణించిన వారి కుటుంబ సభ్యుల బాధ్యతను ప్రభుత్వమే తీసుకుంటుందని పేర్కొంది. ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ ఆ దేశంలో నిరసనలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఆ తర్వాతి పరిణామాలు షేక్ హసీనాను గద్దె దించేలా చేశాయి.
Similar News
News October 14, 2025
పట్టుచీర కట్టిన తర్వాత..

ప్రతీ పండుగకు ఒక పట్టుచీర తీసి కడుతుంటారు మగువలు. అయితే వీటిని ప్రతిసారీ వాష్ చేస్తే పాడైపోయే అవకాశం ఉంది. కాబట్టి కొన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. * కొత్త చీరలపై ఏవైనా మరకలు పడితే, ఆ ప్రాంతం వరకే శుభ్రం చేయ్యాలి. * చాలామంది కొత్త చీరలను డిటర్జెంట్, షాంపూలతో వాష్ చేస్తారు. అప్పుడు గాఢత తక్కువ ఉన్నవాటిని వాడాలి. * చీరలను కలిపి ఉతికేటపుడు వేటికవే విడిగా ఉతకాలి. లేదంటే రంగులు అంటుకోవచ్చు.
News October 14, 2025
IPS ఆత్మహత్య.. డీజీపీకి ‘సెలవు’

హరియాణాలో తెలుగు IPS పూరన్ కుమార్ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న DGP శత్రుజిత్ కపూర్ను ప్రభుత్వం ‘బలవంతపు సెలవు’పై పంపింది. రోహ్తక్ SP నరేంద్ర బిజార్నియాపై ఇప్పటికే బదిలీ వేటు వేసింది. ఉన్నతాధికారుల కులవివక్ష వేధింపుల వల్లే తన భర్త ఆత్మహత్య చేసుకున్నారని పూరన్ భార్య, IAS అమ్నీత్ కుమార్ ఆరోపిస్తున్నారు. ఈక్రమంలోనే ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
News October 14, 2025
BREAKING: లొంగిపోయిన మల్లోజుల

మావోయిస్టు కేంద్ర కమిటీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. అగ్రనేత మల్లోజుల వేణుగోపాల రావు 60 మంది సభ్యులతో కలిసి మహారాష్ట్ర గడ్చిరోలి పోలీసుల ఎదుట లొంగిపోయారు. కొద్దికాలంగా ఈయన మావోయిస్టుల ప్రస్తుత పంథాకు వ్యతిరేకంగా లేఖలు విడుదల చేస్తుండటం తెలిసిందే. పెద్దపల్లి జిల్లాకు చెందిన ఈయన 30 ఏళ్లుగా ఉద్యమంలో ఉన్నారు. ఈయనపై 100కు పైగా కేసులున్నాయి. రూ.1కోటి రివార్డు ఉంది.