News May 10, 2024
ఆరు రోజుల్లో $2 బిలియన్లకుపైనే వెనక్కి తీసుకున్నారు!

భారత స్టాక్ మార్కెట్లోని తమ షేర్లను విదేశీ మదుపర్లు పెద్ద ఎత్తున విక్రయిస్తున్నారు. ఈనెల తొలి ఆరు సెషన్లలోనే ఏకంగా $2.4 బిలియన్లు (రూ.20వేలకోట్లకుపైనే) విలువైన షేర్లను ఉపసంహరించుకున్నారు. ఎన్నికల ఫలితాలపై అనుమానాలు వ్యక్తమవడమే ఇందుకు కారణం అంటున్నారు నిపుణులు. మే 2, 3, 6, 7 తేదీల్లో రూ.6వేల కోట్లకుపైగా విలువైన షేర్లు విక్రయించగా, మే 8న రూ.6,669కోట్లు, మే 9న రూ.6,994కోట్ల షేర్లు విక్రయించారు.
Similar News
News March 16, 2026
INDలో ప్రతి నలుగురిలో ఒకరికి ‘మైగ్రేన్’!

మైగ్రేన్ అనేది సాధారణ తలనొప్పి కాదని, ఇది తీవ్రమైన నాడీ సంబంధిత సమస్య అని వైద్యులు పేర్కొన్నారు. ‘ఇండియాలో ప్రతి నలుగురిలో ఒకరు దీనితో బాధపడుతున్నారు. మైగ్రేన్ ఉన్నవారిలో తీవ్రమైన తలనొప్పితోపాటు వాంతులు, వెలుతురును చూడలేకపోవడం వంటివి కనిపిస్తాయి. ఒత్తిడి, నిద్రలేమి, ఆహారపు అలవాట్ల వల్ల ఇది పెరుగుతుంది. జీవనశైలిలో మార్పులు చేసుకుంటూ, సరైన చికిత్సతో దీనిని తగ్గించవచ్చు’ అని సూచిస్తున్నారు.
News March 16, 2026
FLASH: తగ్గిన బంగారం ధర

బంగారం ధర క్రమంగా దిగొస్తోంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఇవాళ రూ.490 తగ్గి రూ.1,59,170కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.450 పతనమై రూ.1,45,900 పలుకుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ధరల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News March 16, 2026
గంట మోగించేటప్పుడు పాటించాల్సిన కొన్ని నియమాలు

ఆలయంలోకి ప్రవేశించేటప్పుడు మాత్రమే గంట కొట్టాలి. తిరిగి వచ్చేటప్పుడు కొట్టకూడదు. ఇంట్లో పూజ చేసేటప్పుడు గంటను ఎడమ చేతితో పట్టుకుని లయబద్ధంగా మోగించాలి. అనవసరంగా, పదేపదే కొట్టకూడదు. 2,3 సార్లు స్పష్టంగా మోగించడం శ్రేయస్కరం. రాత్రి సమయాల్లో గంటను బిగ్గరగా మోగించకూడదు. ఈ నియమాలను పాటిస్తే దేవతల ఆవాహన జరగడమే కాకుండా, ఆ ప్రతిధ్వని ద్వారా మనసు ఏకాగ్రతను పొంది ఇంట్లో సానుకూల ప్రకంపనలు వ్యాపిస్తాయి.


