News May 10, 2024
ఆరు రోజుల్లో $2 బిలియన్లకుపైనే వెనక్కి తీసుకున్నారు!

భారత స్టాక్ మార్కెట్లోని తమ షేర్లను విదేశీ మదుపర్లు పెద్ద ఎత్తున విక్రయిస్తున్నారు. ఈనెల తొలి ఆరు సెషన్లలోనే ఏకంగా $2.4 బిలియన్లు (రూ.20వేలకోట్లకుపైనే) విలువైన షేర్లను ఉపసంహరించుకున్నారు. ఎన్నికల ఫలితాలపై అనుమానాలు వ్యక్తమవడమే ఇందుకు కారణం అంటున్నారు నిపుణులు. మే 2, 3, 6, 7 తేదీల్లో రూ.6వేల కోట్లకుపైగా విలువైన షేర్లు విక్రయించగా, మే 8న రూ.6,669కోట్లు, మే 9న రూ.6,994కోట్ల షేర్లు విక్రయించారు.
Similar News
News September 18, 2025
వరుసగా మూడోరోజు లాభాల్లో ముగిసిన మార్కెట్లు

భారత స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజు లాభాల్లో ముగిశాయి. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ తన కీలక వడ్డీ రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించడం మార్కెట్లపై సానుకూల ప్రభావం చూపింది. ముఖ్యంగా ఐటీ షేర్ల కొనుగోళ్లు ఊపందుకున్నాయి. దీంతో సెన్సెక్స్ 320 పాయింట్లు లాభపడి 83,013 వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ 93 పాయింట్లు వృద్ధి చెంది 25,423 వద్ద ముగిసింది. ఫార్మా షేర్లు కూడా భారీగా లాభాలు ఆర్జించాయి.
News September 18, 2025
మృతుల కుటుంబాలకు ₹5లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా

AP: నెల్లూరు (D) సంగం(M) పెరమన వద్ద నిన్న కారును టిప్పర్ ఢీకొన్న ఘటనలో ఏడుగురు మృతిచెందారు. ఈ ప్రమాదంపై CM చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున రూ.35లక్షలు పరిహారం అందించాలని అధికారులను ఆదేశించారు. రాంగ్ రూట్లో వచ్చిన టిప్పర్ కారును ఢీకొట్టి కొద్దిదూరం లాక్కెళ్లగా చిన్నారితో సహా ఏడుగురు మరణించారు.
News September 18, 2025
HLL లైఫ్కేర్లో ఉద్యోగాలు

<