News April 7, 2025

50కి పైగా దేశాలు మాతో బేరాలాడుతున్నాయి: US

image

ట్రంప్ విధించిన సుంకాలతో ప్రభావితమైన వాటిలో 50కి పైగా దేశాలు తమతో టారిఫ్‌ల తగ్గింపుపై బేరాలాడుతున్నాయని అమెరికా జాతీయ ఆర్థిక మండలి డైరెక్టర్ కెవిన్ హాసెట్ వెల్లడించారు. ‘దేశ ప్రయోజనాలే ట్రంప్‌కు ముఖ్యం. వేరే ఉద్దేశాలేం లేవు. అనేక దేశాలు ఇప్పుడు మాతో చర్చలు జరుపుతున్నాయి. సుంకాల వల్ల పెద్ద ఇబ్బంది అవుతుందని మేం భావించట్లేదు. మనకు ఎగుమతి చేసే దేశాలు తమ సుంకాల్ని తగ్గిస్తాయంతే’ అని వివరించారు.

Similar News

News April 9, 2025

మా బంధం సీక్రెట్ అదే: ఉపాసన

image

వ్యాపారాల్లో ఉన్నట్లుగానే వివాహ బంధంలోనూ భార్యాభర్తలు సమీక్ష చేసుకోవాలని మెగా కోడలు ఉపాసన ఓ ఇంటర్వ్యూలో అభిప్రాయపడ్డారు. ‘ఇద్దరికీ మధ్య సమస్య వచ్చినప్పుడు కూర్చుని మాట్లాడుకోవాలి. బంధంలో ఎత్తుపల్లాలన్నవి సహజం. ఆ సమయంలో ఒకరినొకరు ఎలా గౌరవించుకున్నారన్నది ముఖ్యం. మేం వారానికి ఒకరోజైనా ఒకరికొకరు పూర్తి సమయాన్ని కేటాయించుకుంటాం. సమస్య ఉంటే చర్చించి పరిష్కరించుకుంటాం. అదే మా సీక్రెట్’ అని తెలిపారు.

News April 9, 2025

కొనసాగుతున్న అల్పపీడనం

image

AP: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం మరింత బలపడింది. దీంతో ఈరోజు, రేపు రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షపాతం నమోదు కావొచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇక 11న ఉత్తరాంధ్రలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మరోవైపు ఏలూరులో 5 మండలాలు, ఎన్టీఆర్ జిల్లాలో 2, గుంటూరులో 9, పల్నాడులో 2 మండలాల్లో తీవ్ర వడగాలులు ఉంటాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

News April 9, 2025

నేడు సీఎం చంద్రబాబు సొంతింటి శంకుస్థాపన

image

AP: CM చంద్రబాబు నేడు సొంతింటి నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. ఉదయం 8.51 గంటలకు ఆయన కుటుంబీకులతో కలిసి భూమిపూజలో పాల్గొననున్నారు. వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయం వెనుక ఈ-9 రోడ్డులో 5.25 ఎకరాల్లో ఇంటి నిర్మాణం జరగనుంది. ఓ రైతు నుంచి ఆ భూమిని కొనుగోలు చేశారు. భూమి చదును పనులు నిన్నటికి పూర్తయ్యాయి. జీ ప్లస్ వన్‌గా ఇంటిని నిర్మిస్తారని తెలుస్తోంది. వచ్చే ఏడాదిలోపే గృహ ప్రవేశం చేసే అవకాశం ఉంది.

error: Content is protected !!