News July 14, 2024

అతి విశ్వాసమే ఎన్నికల్లో దెబ్బతీసింది: యోగి

image

గెలుపుపై అతి విశ్వాసం వల్లే లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తర్‌ప్రదేశ్‌లో BJPకి ఆశించిన ఫలితాలు రాలేదని CM యోగి ఆదిత్యనాథ్ అన్నారు. ‘2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన BJP, అదే ఓట్ల శాతంతో 2024లోనూ గెలుపొందింది. ఈసారి గణనీయమైన మార్పు ఏంటంటే విపక్షాలకు ఓట్ల శాతం పెరుగుతున్నట్లు కనిపిస్తోంది’ అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాగా లోక్‌సభ ఎన్నికల్లో UPలో SP 37, BJP 33, కాంగ్రెస్ 6, ఇతరులు 4 సీట్లలో నెగ్గారు.

Similar News

News October 25, 2025

ఇతిహాసాలు క్విజ్ – 46

image

1. రామాయణంలో జటాయువు సోదరుడి పేరేంటి?
2. అమృతం కోసం దేవతలు, రాక్షసులు క్షీరసాగరాన్ని చిలికిన పర్వతం ఏది?
3. నాగుల చవితి ఏ మాసంలో వస్తుంది?
4. ఇంద్రుడికి గురువు ఎవరు?
5. అష్టదిక్పాలకులలో ఉత్తర దిక్కును పాలించేది ఎవరు?
✍️ సరైన సమాధానాలు సాయంత్రం 6 గంటలకు పబ్లిష్ చేస్తాం.
<<-se>>#Ithihasaluquiz<<>>

News October 25, 2025

BEL మరో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల

image

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(BEL) 38 ఇంజినీరింగ్ అసిస్టెంట్, టెక్నీషియన్-C పోస్టులకు మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. డిప్లొమా, ఇంటర్+ITI అర్హతగల అభ్యర్థులు NOV16 వరకు అప్లై చేసుకోవచ్చు. గరిష్ఠ వయసు 28ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. మహారాష్ట్ర స్టేట్ ఎంప్లాయిమెంట్ ఎక్స్ఛేంజ్‌లో అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలి. రాతపరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: bel-india.in/

News October 25, 2025

బస్సు ప్రమాదం.. వందల ఫోన్లు పేలడంతో?

image

AP: కర్నూలులో జరిగిన బస్సు ప్రమాదంలో 19 మంది అగ్నికి ఆహుతైన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రధాన కారణంగా తెలుస్తోండగా మరిన్ని విషయాలు వెలుగు చూశాయి. డోర్ దగ్గర ఉన్న చిన్న హైడ్రాలిక్ సిలిండర్ పేలిపోగా డోర్లు తెరుచుకోలేదు. అటు లగేజీ క్యాబిన్‌లో 400కు పైగా ఫోన్లతో ఉన్న పార్సిల్ ఉన్నట్లు ఫోరెన్సిక్ టీమ్ గుర్తించింది. వేడికి ఈ బ్యాటరీలు పేలడం ప్రమాద తీవ్రతను పెంచిందని చెబుతున్నాయి.