News August 20, 2024
కిక్కిరిసిపోతున్న జైళ్లు!

రాష్ట్రంలోని జైళ్లు ఖైదీలతో నిండిపోయాయి. మాదకద్రవ్యాలకు సంబంధించిన అరెస్టులతో సామర్థ్యం కంటే రెట్టింపు ఖైదీలను జైళ్లలో ఉంచాల్సి వస్తోంది. చంచల్గూడ సెంట్రల్ జైలులో 1,250 మందిని ఉంచాల్సి ఉండగా ప్రస్తుతం 2,103 మంది ఖైదీలు ఉన్నారు. సంగారెడ్డి జైలులో 220 మందికి బదులు 569 మంది ఖైదీలున్నారు. వరంగల్ సెంట్రల్ జైలును కూల్చేయడంతో అందులోని వెయ్యి మంది ఖైదీలను ఇతర జైళ్లకు తరలించడంతో వాటిలో రద్దీ పెరిగింది.
Similar News
News January 13, 2026
‘మన శంకరవరప్రసాద్ గారు’ తొలిరోజు కలెక్షన్లు ఎంతంటే?

మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ తొలి రోజు ప్రీమియర్స్తో కలిపి ఇండియాలో రూ.37.10 కోట్లు వసూలు చేసినట్లు ‘sacnilk’ పేర్కొంది. ఇందులో సోమవారం రూ.28.50 కోట్లు కలెక్ట్ చేసింది. ఇక ప్రీమియర్ షోల ద్వారా రూ.8.6 కోట్లు రాబట్టింది. డైరెక్టర్ అనిల్ రావిపూడి కమర్షియల్ టచ్, పండుగ సీజన్తో పాటు సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్స్ పెరిగే ఛాన్స్ ఉంది.
News January 13, 2026
తక్కువ ఖర్చుతో పంటకు రక్ష, దిగుబడికి భరోసా

సాగులో ప్రకృతి వైపరీత్యాల కంటే చీడపీడలతోనే ఎక్కువ నష్టం జరుగుతోంది. ఈ సమస్య నివారణకు లింగాకర్షక బుట్టలు, జిగురు అట్టలు, లైట్ ట్రాప్స్ ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. ఇవి పురుగులను ఆకర్షించి, నిర్మూలించి వాటి ఉద్ధృతి పెరగకుండా కట్టడి చేస్తున్నాయి. దీంతో పురుగు మందుల వినియోగం తగ్గి, పర్యావరణానికి, మిత్ర పురుగులకు మేలు జరుగుతోంది. ఏ పంటకు ఏ పరికరం వాడితే లాభమో తెలుసుకోవడానికి <<-se_10015>>పాడిపంట క్లిక్<<>> చేయండి.
News January 13, 2026
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో గ్రూప్ Y పోస్టులు

<


