News September 25, 2024

తిరుమల నెయ్యి కల్తీపై ఒవైసీ కామెంట్స్

image

తిరుమల లడ్డూ అంశంపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. ‘లడ్డూలో వాడే నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని అంటున్నారు. ప్రసాదంలో అలా జరగడం బాధాకరం. మరోవైపు కాశీ బోర్డులో అందరూ హిందువులే ఉన్నప్పుడు వక్ఫ్ బోర్డు సవరణ చట్టం తీసుకొచ్చి ముస్లిం సంస్థల్లో హిందువులను ఎలా పెడతారు?’ అని ప్రశ్నించారు.

Similar News

News November 15, 2025

లక్నోకు అర్జున్, షమీ.. DCకి నితీశ్ రాణా

image

ఐపీఎల్ రిటెన్షన్ గడువు నేటితో ముగుస్తుండటంతో ఫ్రాంచైజీలు ఆటగాళ్లను ట్రేడ్ చేస్తున్నాయి. ముంబై ఇండియన్స్ నుంచి సచిన్ కొడుకు అర్జున్ టెండూల్కర్ లక్నో‌కు వెళ్లారు. సన్‌రైజర్స్ బౌలర్ షమీ కూడా LSG జట్టులో చేరారు. అటు రాజస్థాన్ రాయల్స్‌ను వీడిన నితీశ్ రాణా ఢిల్లీ క్యాపిటల్స్‌‌లో చేరారు. KKR ప్లేయర్ మయాంక్ మార్కండేను ముంబై ట్రేడ్ చేసుకుంది.

News November 15, 2025

సెంచరీ కోసం నిరీక్షణ! అప్పుడు విరాట్.. ఇప్పుడు బాబర్

image

2019 నవంబర్ 23న సెంచరీ చేసిన విరాట్.. మరో సెంచరీ కోసం దాదాపు రెండున్నరేళ్లు నిరీక్షించారు. 2022, సెప్టెంబర్ 8న అఫ్గానిస్థాన్‌పై శతకదాహం తీర్చుకున్నారు. తాజాగా పాకిస్థానీ బ్యాటర్ బాబర్ ఆజమ్ అదే పరిస్థితిని ఎదుర్కొన్నారు. 2023, ఆగస్టు 30న సెంచరీ చేసిన బాబర్.. 807 రోజుల తర్వాత మరో సెంచరీ చేశారు. నిన్న శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో అజేయ సెంచరీ సాధించి సుదీర్ఘ సెంచరీ నిరీక్షణకు తెరదించారు.

News November 15, 2025

సమూల ప్రక్షాళన దిశగా KCR అడుగులు!

image

TG: 2023 అసెంబ్లీ ఎన్నికల నుంచి జూబ్లీహిల్స్ బై పోల్ వరకూ BRS వరుస ఓటములతో సతమతమవుతోంది. పరిస్థితి ఇలాగే ఉంటే వచ్చే GHMC ఎన్నికల్లోనూ పార్టీకి నష్టం చేకూరే అవకాశముంది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ చీఫ్ KCR సమూల మార్పుల దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు అడ్‌హక్ కమిటీలతో పార్టీని నడిపిన ఆయన.. త్వరలోనే రాష్ట్రస్థాయి వరకూ కొత్త నాయకత్వాన్ని బలోపేతం చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.